ETV Bharat / city

'నిర్లక్ష్య వైఖరితో విశ్వనగరాన్ని విషాదనగరంగా మార్చారు'

author img

By

Published : Oct 15, 2020, 8:55 PM IST

ఏడేళ్ల తెరాస ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.. హైదరాబాద్​ విశ్వనగరం కాస్త విషాదనగరంగా మారిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​కుమార్​ ఆరోపించారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి... వర్షం బాధితులకు సాయం అందించాలని దాసోజు డిమాండ్​ చేశారు.

dasoju sravan kumar on hyderabad rains
'నిర్లక్ష్య వైఖరితో విశ్వనగరాన్ని విషాదనగరంగా మార్చారు'

హైదరాబాద్​ విశ్వనగరాన్ని తెరాస ప్రభుత్వం విషాద నగరంగా మార్చిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​కుమార్​ ఆరోపించారు. ఏడేళ్ల ప్రభుత్వ నిర్లక్ష్యంలో ప్రజలు వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు వదులుతున్నారని విమర్శించారు. జీహెచ్​ఎంసీకి అవసరమైన నిధులు కేటాయించకుండా ఓపెన్​ నాలాలు, మరమ్మతులు చేయకపోవడం వల్లే.. భాగ్యనగరానికి ఈ దుస్థితి నెలకొందని ధ్వజమెత్తారు.

భారీ వర్షాల వల్ల చనిపోయిన వారి సంఖ్యనూ తప్పుగా చూపిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. రోమ్ నగరం తగలబడుతున్నప్పుడు చక్రవర్తి ఫిడేల్​ వాయిస్తూ ఉన్నట్లు సీఎం కేసీఆర్​ వ్యవహరిస్తున్నారని శ్రవణ్​ ఆరోపించారు. వరదల్లో చిక్కుకున్న నగరవాసులకు కార్పొరేటర్లు కనిపించడం లేదని... ప్రజలకు కనీసం తినేందుకు ఆహారం ఇచ్చే పరిస్థితిలో కూడా లేరని ఆరోపించారు.

హైదరాబాద్​ విశ్వనగరాన్ని తెరాస ప్రభుత్వం విషాద నగరంగా మార్చిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​కుమార్​ ఆరోపించారు. ఏడేళ్ల ప్రభుత్వ నిర్లక్ష్యంలో ప్రజలు వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు వదులుతున్నారని విమర్శించారు. జీహెచ్​ఎంసీకి అవసరమైన నిధులు కేటాయించకుండా ఓపెన్​ నాలాలు, మరమ్మతులు చేయకపోవడం వల్లే.. భాగ్యనగరానికి ఈ దుస్థితి నెలకొందని ధ్వజమెత్తారు.

భారీ వర్షాల వల్ల చనిపోయిన వారి సంఖ్యనూ తప్పుగా చూపిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. రోమ్ నగరం తగలబడుతున్నప్పుడు చక్రవర్తి ఫిడేల్​ వాయిస్తూ ఉన్నట్లు సీఎం కేసీఆర్​ వ్యవహరిస్తున్నారని శ్రవణ్​ ఆరోపించారు. వరదల్లో చిక్కుకున్న నగరవాసులకు కార్పొరేటర్లు కనిపించడం లేదని... ప్రజలకు కనీసం తినేందుకు ఆహారం ఇచ్చే పరిస్థితిలో కూడా లేరని ఆరోపించారు.

ఇవీ చూడండి: వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 8మంది గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.