ETV Bharat / city

సోనూసూద్‌ పేరిట మోసం.. నిరుపేద సొమ్ము కొట్టేసిన అగంతకుడు

author img

By

Published : Aug 10, 2021, 5:17 PM IST

ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్. అయితే సోనూ సూద్ పేరును వాడుకుని సాయం చేస్తామంటూ.. పేదల నడ్డి విరుస్తున్నారు కేటుగాళ్లు. సామాజిక మాధ్యమాల్లో సమాచారం తీసుకుని.. సైబర్ వల విసురుతున్నారు. చిక్కుకుంటే అంతేనని హెచ్చరిస్తున్నారు పోలీసులు. కథేంటంటే..!

sonu
sonu

ఓ పేదింటి యువకుడి దీనస్థితిని ఆసరాగా తీసుకొని అగంతకుడు మోసానికి పాల్పడ్డాడు. కరోనా సమయంలో వేలాదిమందికి సాయం చేసిన హీరో సోనూసూద్‌ పేరిట మోసం చేశాడు. ఈ సంఘటన సంతబొమ్మాళిలో సోమవారం చోటుచేసుకుంది. సంతబొమ్మాళి వెలమవీధికి చెందిన కొయ్యాన రాంబాబు కుటుంబ పరిస్థితి సరిగా లేకపోవడంతో కూలిపనులు చేసుకుంటూ చదువుకుంటున్నాడు. అతని మిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో సాయం చేయాలని అర్థిస్తున్నారు. దీన్ని అదునుగా తీసుకున్న ఓ అగంతకుడు బాధితుడికి సాయం చేస్తానని చెప్పి మోసానికి పాల్పడ్డాడు.

సోనూసూద్‌ను మాట్లాడుతున్నానంటూ రాంబాబుకు సోమవారం ఫోన్‌ చేశారు. బ్యాంకు ఖాతాలో రూ.3 లక్షలు ట్రస్టు ద్వారా వేస్తామని చెప్పి, ముందుగా రూ.12 వేలు నగదు జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని ఫోన్‌లో చెప్పారు. రిజిస్ట్రేషన్‌ ఖర్చుల కింద ముందుగా రూ.2 వేలు ఫోన్‌పే చేయాలనడంతో అతని మాటలు నమ్మిన రాంబాబు తన మిత్రుడు సాయంతో ఆ నగదు పంపించారు. గంట తర్వాత ఆ నెంబర్‌కు కాల్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది. దీంతో మోసపోయానని తెలుకున్న బాధితుడు సంతబొమ్మాళి ఎస్‌.ఐ.గోవింద్‌ దృష్టికి ఇదే విషయాన్ని తెలిపారు.

ఫేక్‌ ఫోన్‌పే అకౌంట్‌ ద్వారా మోసం చేశారని, అగంతకుడు కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడిగా గుర్తించామన్నారు. ఇలాంటి సైబర్‌ మోసాలపై ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఎస్‌.ఐ. సూచించారు.

ఇదీ చదవండి : చిరు లేటెస్ట్ ఫొటోషూట్​.. అదిరిపోయిన లుక్స్

ఓ పేదింటి యువకుడి దీనస్థితిని ఆసరాగా తీసుకొని అగంతకుడు మోసానికి పాల్పడ్డాడు. కరోనా సమయంలో వేలాదిమందికి సాయం చేసిన హీరో సోనూసూద్‌ పేరిట మోసం చేశాడు. ఈ సంఘటన సంతబొమ్మాళిలో సోమవారం చోటుచేసుకుంది. సంతబొమ్మాళి వెలమవీధికి చెందిన కొయ్యాన రాంబాబు కుటుంబ పరిస్థితి సరిగా లేకపోవడంతో కూలిపనులు చేసుకుంటూ చదువుకుంటున్నాడు. అతని మిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో సాయం చేయాలని అర్థిస్తున్నారు. దీన్ని అదునుగా తీసుకున్న ఓ అగంతకుడు బాధితుడికి సాయం చేస్తానని చెప్పి మోసానికి పాల్పడ్డాడు.

సోనూసూద్‌ను మాట్లాడుతున్నానంటూ రాంబాబుకు సోమవారం ఫోన్‌ చేశారు. బ్యాంకు ఖాతాలో రూ.3 లక్షలు ట్రస్టు ద్వారా వేస్తామని చెప్పి, ముందుగా రూ.12 వేలు నగదు జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని ఫోన్‌లో చెప్పారు. రిజిస్ట్రేషన్‌ ఖర్చుల కింద ముందుగా రూ.2 వేలు ఫోన్‌పే చేయాలనడంతో అతని మాటలు నమ్మిన రాంబాబు తన మిత్రుడు సాయంతో ఆ నగదు పంపించారు. గంట తర్వాత ఆ నెంబర్‌కు కాల్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది. దీంతో మోసపోయానని తెలుకున్న బాధితుడు సంతబొమ్మాళి ఎస్‌.ఐ.గోవింద్‌ దృష్టికి ఇదే విషయాన్ని తెలిపారు.

ఫేక్‌ ఫోన్‌పే అకౌంట్‌ ద్వారా మోసం చేశారని, అగంతకుడు కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడిగా గుర్తించామన్నారు. ఇలాంటి సైబర్‌ మోసాలపై ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఎస్‌.ఐ. సూచించారు.

ఇదీ చదవండి : చిరు లేటెస్ట్ ఫొటోషూట్​.. అదిరిపోయిన లుక్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.