ETV Bharat / city

కొవిడ్​ కట్టడిపై ఉన్నతస్థాయి సమీక్ష చేయండి: సీపీఐ - cpi on corona on corona review

కొవిడ్​ కట్టడిపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ఉన్నతస్థాయి సమీక్ష చేయాలని సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి డిమాండ్​ చేశారు. కరోనా చికిత్సను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్​ చేశారు. శనివారం కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

cpi on corona
కొవిడ్​ కట్టడిపై ఉన్నతస్థాయి సమీక్ష చేయండి: సీపీఐ
author img

By

Published : Aug 14, 2020, 4:04 PM IST

కొవిడ్​ ముసుగులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రహస్య ఏజెండాను అమలుచేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సచివాలయం కూల్చివేత, మూడు రాజధానుల నిర్మాణం ఇందులో భాగమేనన్నారు. కరోనాను కట్టడి చేయలేక కేసీఆర్​ ఫౌంహౌస్​కే పరిమితమయ్యారని నారాయణ విమర్శించారు. కొవిడ్​పై సమీక్షలు మానేసి.. సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై దృష్టిసారించారని మండిపడ్డారు.

మూడు రాజధానుల పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రత్యర్థులపై దాడులు చేస్తోందని మండిపడ్డారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏపీ ప్రభుత్వం చంపేసేలా ఉందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటూ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

కొవిడ్​ నియంత్రణకు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్​ చేశారు. కరోనా చికిత్సను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్​ చేశారు.

ఇవీచూడండి: బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

కొవిడ్​ ముసుగులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రహస్య ఏజెండాను అమలుచేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సచివాలయం కూల్చివేత, మూడు రాజధానుల నిర్మాణం ఇందులో భాగమేనన్నారు. కరోనాను కట్టడి చేయలేక కేసీఆర్​ ఫౌంహౌస్​కే పరిమితమయ్యారని నారాయణ విమర్శించారు. కొవిడ్​పై సమీక్షలు మానేసి.. సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై దృష్టిసారించారని మండిపడ్డారు.

మూడు రాజధానుల పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రత్యర్థులపై దాడులు చేస్తోందని మండిపడ్డారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏపీ ప్రభుత్వం చంపేసేలా ఉందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటూ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

కొవిడ్​ నియంత్రణకు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్​ చేశారు. కరోనా చికిత్సను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్​ చేశారు.

ఇవీచూడండి: బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.