ETV Bharat / city

విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ నిర్ణయం వెన‌క్కి తీసుకోవాలి: డి.రాజా - విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ

ప్రధాని మోదీకి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా లేఖ రాశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

cpi-general-secretary-d-raja-letter-to-pm-modi-over-vizag-steel-plant-privatization
విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ నిర్ణయం వెన‌క్కి తీసుకోవాలి: డి.రాజా
author img

By

Published : Feb 23, 2021, 10:45 PM IST

విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని త‌క్ష‌ణ‌మే వెన‌క్కి తీసుకోవాల‌ని సీపీఐ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దొరైస్వామి రాజా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ప్ర‌ధాన ‌మంత్రి న‌రేంద్ర మోదీకి లేఖ రాశారు. విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటు శ‌క్తులకు అప్ప‌జెప్పే ప్ర‌క్రియ‌పై పున‌రాలోచ‌న చేయాల‌ని కోరారు.

cpi-general-secretary-d-raja-letter-to-pm-modi-over-vizag-steel-plant-privatization
ప్రధానికి డి రాజా లేఖ

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఐఎన్‌ఎల్)లో 100 శాతం పెట్టుబడులను ప్రైవేటుపరం చేసే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను.. త‌మ పార్టీ పూర్తిగా వ్య‌తిరేకిస్తుందని ఆయ‌న స్పష్టం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం... ఈ కంపెనీ న‌వ‌ర‌త్న హోదాని క‌ల్గి ఉంద‌ని చెప్పారు. అలాంటి ఫ్యాక్టరీని ఏ ప్రైవేటు కంపెనీకి అప్ప‌గించినా దానికి సంబంధించిన‌ లక్షల‌ కోట్ల విలువ చేసే భూమిని కూడా ఆ కంపెనీ లాక్కుంటుంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

50 సంవ‌త్స‌రాల క్రిత‌మే ఈ ప‌రిశ్ర‌మ కోసం తెలుగు ప్ర‌జ‌లు సుమారు 23 వేల ఎక‌రాల విలువైన‌ భూమిని ఇచ్చిన‌ట్టు డి.రాజా గుర్తు చేశారు. ఆ స‌మ‌యంలో భూములిచ్చిన రైతుల‌కు స‌రైన ప‌రిహారం చెల్లించ‌లేద‌న్నారు. ప్లాంట్‌ని ప‌రిర‌క్షించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఏ ప్ర‌య‌త్న‌మూ చేయ‌లేద‌ని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఖ‌నిజ గ‌నుల‌ను కేటాయించి ఉంటే.. సంస్థ న‌ష్టాల్లోకి పోయి ఉండేది కాద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జానీకం, ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని రాజ‌కీయాల‌కు అతీతంగా ముక్త‌కంఠంతో వ్య‌తిరేకిస్తున్న‌ట్టు ఆయన గుర్తు చేశారు.

ఇదీ చదవండి: ఇక నుంచి వారంలో ఒకసారి మాత్రమే కేసుల వెల్లడి

విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని త‌క్ష‌ణ‌మే వెన‌క్కి తీసుకోవాల‌ని సీపీఐ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దొరైస్వామి రాజా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ప్ర‌ధాన ‌మంత్రి న‌రేంద్ర మోదీకి లేఖ రాశారు. విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేటు శ‌క్తులకు అప్ప‌జెప్పే ప్ర‌క్రియ‌పై పున‌రాలోచ‌న చేయాల‌ని కోరారు.

cpi-general-secretary-d-raja-letter-to-pm-modi-over-vizag-steel-plant-privatization
ప్రధానికి డి రాజా లేఖ

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఐఎన్‌ఎల్)లో 100 శాతం పెట్టుబడులను ప్రైవేటుపరం చేసే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను.. త‌మ పార్టీ పూర్తిగా వ్య‌తిరేకిస్తుందని ఆయ‌న స్పష్టం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం... ఈ కంపెనీ న‌వ‌ర‌త్న హోదాని క‌ల్గి ఉంద‌ని చెప్పారు. అలాంటి ఫ్యాక్టరీని ఏ ప్రైవేటు కంపెనీకి అప్ప‌గించినా దానికి సంబంధించిన‌ లక్షల‌ కోట్ల విలువ చేసే భూమిని కూడా ఆ కంపెనీ లాక్కుంటుంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

50 సంవ‌త్స‌రాల క్రిత‌మే ఈ ప‌రిశ్ర‌మ కోసం తెలుగు ప్ర‌జ‌లు సుమారు 23 వేల ఎక‌రాల విలువైన‌ భూమిని ఇచ్చిన‌ట్టు డి.రాజా గుర్తు చేశారు. ఆ స‌మ‌యంలో భూములిచ్చిన రైతుల‌కు స‌రైన ప‌రిహారం చెల్లించ‌లేద‌న్నారు. ప్లాంట్‌ని ప‌రిర‌క్షించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఏ ప్ర‌య‌త్న‌మూ చేయ‌లేద‌ని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఖ‌నిజ గ‌నుల‌ను కేటాయించి ఉంటే.. సంస్థ న‌ష్టాల్లోకి పోయి ఉండేది కాద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జానీకం, ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని రాజ‌కీయాల‌కు అతీతంగా ముక్త‌కంఠంతో వ్య‌తిరేకిస్తున్న‌ట్టు ఆయన గుర్తు చేశారు.

ఇదీ చదవండి: ఇక నుంచి వారంలో ఒకసారి మాత్రమే కేసుల వెల్లడి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.