ETV Bharat / city

covid cases: పోలీస్​ శాఖ​లో కొవిడ్​ కలకలం... పెరుగతున్న కేసులు - తెలంగాణ పోలీసుల్లో పెరుగుతున్న కొవిడ్​ కేసులు

పోలీస్‌ శాఖపై కొవిడ్​ మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది. విధి నిర్వహణలో భాగంగా జనసంచారం ఎక్కువగా ఉన్న చోట్ల ఉండడం. ఇతర కారణాల వల్ల తాజాగా పలువులు సిబ్బంది మహమ్మారి బారిన పడ్డారు. అప్రమత్తమైన ఉన్నతాధికారులు సిబ్బందికి పరీక్షలు చేయిస్తున్నారు. బోనాల సందర్భంగా బందోబస్తుకు వచ్చిన సిబ్బందికి ఆయా ప్రాంతాల్లో టెస్టులు చేయిస్తున్నారు.

covid
covid
author img

By

Published : Aug 6, 2021, 2:15 PM IST

పోలీస్‌శాఖలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విధి నిర్వహణలో ప్రజలను కలుసుకోవడం.. నిరసన ప్రదర్శనలు.. ధర్నాలు.. ముట్టడి కార్యక్రమాల్లో ఆందోళనకారులను అరెస్ట్‌ చేయడం.. వరుసగా సాగిన వేడుకల్లో రాత్రింబవళ్లు పనిచేయడంతో కొందరు పోలీసులకు వైరస్‌ సోకింది. ఇందులో ఇద్దరు మహిళా ఇన్‌స్పెక్టర్లు. ముగ్గురు ఎస్సైలు.. ఆరుగురు కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ రావడంతో వారు ఇళ్లకు పరిమితమయ్యారు. మరికొందరు లక్షణాలతో బాధపడుతున్నారు. అప్రమత్తమైన ఉన్నతాధికారులు బోనాల సందర్భంగా బందోబస్తుకు ఇతర జిల్లాల నుంచి వచ్చి వెళ్లిన వారి ఆరోగ్యంపై ఆరాతీస్తున్నారు.

15 రోజుల్లో 11 మందికి

కరోనా నుంచి రక్షించుకునేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు సిబ్బందితోపాటు వారి కుటుంబసభ్యులకూ టీకాలు వేయిస్తున్నారు. గతనెల రెండోవారం నుంచి వేడుకలు, ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు ఊపందుకోవడంతో పోలీసులు విధుల్లో తలమునకలయ్యారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద బందోబస్తులు, చెక్‌పోస్టుల వద్ద తనిఖీల్లో పాల్గొన్న కొందరు అనారోగ్యం పాలయ్యారు. మరికొందరికి లక్షణాలు కనిపించకపోవడంతో విధులకు హాజరయ్యారు. 15 రోజుల్లోనే 11 మంది సిబ్బందికి కరోనా సోకింది.

రోజురోజుకు పెరుగుతున్న కేసులు

నగరంలో 4రోజుల నుంచి క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. పాతబస్తీ, పశ్చిమ, ఉత్తర మండలంలోని కొన్నికేంద్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోందని నివేదికలు సూచిస్తున్నాయి. గాంధీఆసుపత్రిలో మూడు రోజుల నుంచి కరోనాతో బాధపడుతూ చికిత్స కోసం వస్తున్నవారి సంఖ్య 30కిపైగా ఉంటోంది. మంగళ, బుధవారాల్లో 40 కేసులు వచ్చాయి. ఉన్నతాధికారులు అప్రమత్తమై ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను మరికొద్దిరోజులు అక్కడే ఉండాల్సిందిగా మౌఖిక ఆదేశాలు జారీచేశారు.

ఇదీ చూడండి: దేశంలో కొత్తగా 44,643 కరోనా కేసులు

పోలీస్‌శాఖలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విధి నిర్వహణలో ప్రజలను కలుసుకోవడం.. నిరసన ప్రదర్శనలు.. ధర్నాలు.. ముట్టడి కార్యక్రమాల్లో ఆందోళనకారులను అరెస్ట్‌ చేయడం.. వరుసగా సాగిన వేడుకల్లో రాత్రింబవళ్లు పనిచేయడంతో కొందరు పోలీసులకు వైరస్‌ సోకింది. ఇందులో ఇద్దరు మహిళా ఇన్‌స్పెక్టర్లు. ముగ్గురు ఎస్సైలు.. ఆరుగురు కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ రావడంతో వారు ఇళ్లకు పరిమితమయ్యారు. మరికొందరు లక్షణాలతో బాధపడుతున్నారు. అప్రమత్తమైన ఉన్నతాధికారులు బోనాల సందర్భంగా బందోబస్తుకు ఇతర జిల్లాల నుంచి వచ్చి వెళ్లిన వారి ఆరోగ్యంపై ఆరాతీస్తున్నారు.

15 రోజుల్లో 11 మందికి

కరోనా నుంచి రక్షించుకునేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు సిబ్బందితోపాటు వారి కుటుంబసభ్యులకూ టీకాలు వేయిస్తున్నారు. గతనెల రెండోవారం నుంచి వేడుకలు, ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు ఊపందుకోవడంతో పోలీసులు విధుల్లో తలమునకలయ్యారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద బందోబస్తులు, చెక్‌పోస్టుల వద్ద తనిఖీల్లో పాల్గొన్న కొందరు అనారోగ్యం పాలయ్యారు. మరికొందరికి లక్షణాలు కనిపించకపోవడంతో విధులకు హాజరయ్యారు. 15 రోజుల్లోనే 11 మంది సిబ్బందికి కరోనా సోకింది.

రోజురోజుకు పెరుగుతున్న కేసులు

నగరంలో 4రోజుల నుంచి క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. పాతబస్తీ, పశ్చిమ, ఉత్తర మండలంలోని కొన్నికేంద్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోందని నివేదికలు సూచిస్తున్నాయి. గాంధీఆసుపత్రిలో మూడు రోజుల నుంచి కరోనాతో బాధపడుతూ చికిత్స కోసం వస్తున్నవారి సంఖ్య 30కిపైగా ఉంటోంది. మంగళ, బుధవారాల్లో 40 కేసులు వచ్చాయి. ఉన్నతాధికారులు అప్రమత్తమై ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను మరికొద్దిరోజులు అక్కడే ఉండాల్సిందిగా మౌఖిక ఆదేశాలు జారీచేశారు.

ఇదీ చూడండి: దేశంలో కొత్తగా 44,643 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.