ETV Bharat / city

కొవిడ్‌ బోగీ.. చికిత్స పొందడానికి రాలే ఒక్క రోగీ ! - South Central Railway Covid compartments

కరోనా విజృంభిస్తున్నందున దేశవ్యాప్తంగా 16 రైల్వేజోన్ల పరిధిలో 5వేలకు పైగా బోగీలను ఐసోలేషన్​ వార్డులుగా మార్చింది. దాదాపు రూ.34 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన కొవిడ్​ బోగీల్లో చికిత్స పొందడానికి ఒక్క రోగి కూడా రాలేదు.

Covid compartments in South Central Railway
ప్రయాణికులకు అందుబాటులోకి కొవిడ్‌ బోగీ
author img

By

Published : Oct 31, 2020, 11:07 AM IST

కరోనా విలయతాండవం చేస్తున్న దృష్ట్యా. దేశవ్యాప్తంగా 20 వేల రైల్వే బోగీలను ఐసొలేషన్‌ వార్డులుగా మారుస్తామని, తద్వారా 3 లక్షల పైచిలుకు పడకలు అందుబాటులోకి వస్తాయని లాక్‌డౌన్‌ ప్రారంభంలో రైల్వే శాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య 16 రైల్వే జోన్ల పరిధిలో 5,601 బోగీల్ని ఐసొలేషన్‌ వార్డులుగా మార్చింది. మధ్య బెర్తులను తొలగించడం, ఒక టాయిలెట్‌ను స్నానాల గదిగా మార్చడం, మధ్యమధ్యలో ప్లాస్టిక్‌ తెరలను ఏర్పాటుచేయడం వంటి మార్పుల కోసం ఒక్కో బోగీకి రూ.60 వేల పైచిలుకు ఖర్చుచేశారు.

దేశవ్యాప్తంగా ఇలా బోగీలను మార్చడానికి దాదాపు రూ.34 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే కూడా 486 ‘కొవిడ్‌ బోగీ’లను సిద్ధం చేసింది. హైదరాబాద్‌లో కొన్నింటిని, కాచిగూడ స్టేషన్‌లో మరికొన్నింటిని అందుబాటులో ఉంచింది. వాటిలో చికిత్స పొందడానికి ఒక్క రోగీ రాలేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. గత ఐదారు నెలలుగా ఖాళీగా ఉంటున్న వీటిని తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ యోచిస్తోంది.

కరోనా విలయతాండవం చేస్తున్న దృష్ట్యా. దేశవ్యాప్తంగా 20 వేల రైల్వే బోగీలను ఐసొలేషన్‌ వార్డులుగా మారుస్తామని, తద్వారా 3 లక్షల పైచిలుకు పడకలు అందుబాటులోకి వస్తాయని లాక్‌డౌన్‌ ప్రారంభంలో రైల్వే శాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య 16 రైల్వే జోన్ల పరిధిలో 5,601 బోగీల్ని ఐసొలేషన్‌ వార్డులుగా మార్చింది. మధ్య బెర్తులను తొలగించడం, ఒక టాయిలెట్‌ను స్నానాల గదిగా మార్చడం, మధ్యమధ్యలో ప్లాస్టిక్‌ తెరలను ఏర్పాటుచేయడం వంటి మార్పుల కోసం ఒక్కో బోగీకి రూ.60 వేల పైచిలుకు ఖర్చుచేశారు.

దేశవ్యాప్తంగా ఇలా బోగీలను మార్చడానికి దాదాపు రూ.34 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే కూడా 486 ‘కొవిడ్‌ బోగీ’లను సిద్ధం చేసింది. హైదరాబాద్‌లో కొన్నింటిని, కాచిగూడ స్టేషన్‌లో మరికొన్నింటిని అందుబాటులో ఉంచింది. వాటిలో చికిత్స పొందడానికి ఒక్క రోగీ రాలేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. గత ఐదారు నెలలుగా ఖాళీగా ఉంటున్న వీటిని తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ యోచిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.