ETV Bharat / city

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

author img

By

Published : Jun 27, 2020, 10:22 PM IST

Updated : Jun 27, 2020, 10:53 PM IST

తెలంగాణలో మరో 1087 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణలో మరో 1087 మందికి కరోనా పాజిటివ్

22:16 June 27

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

జిల్లాల వారిగా నమోదైన కేసుల వివరాలు
జిల్లాల వారిగా నమోదైన కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం కొనసాగుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు మరో 1087 కేసులు నమోదు కావడం తీవ్రంగా కలవర పెడుతోంది. శనివారం మొత్తం 3,923 శాంపిల్స్‌ను పరీక్షించగా.. వాటిలో 1087 పాజిటివ్‌గా తేలగా.. 2836 నెగెటివ్‌గా నిర్ధరణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13,436కి పెరిగింది. 

మరో ఆరు మరణాలు

రాష్ట్రంలో కొవిడ్‌ బారిన పడి మరో ఆరుగురు మృత్యువాత పడ్డారు. వైరస్​ బారిన పడి రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 243కి పెరిగింది. రాష్ట్రంలో ఈ రోజు మరో 162 మంది కోలుకున్నారు. ఇప్పటిదాకా డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4928కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8265 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

 

హైదరాబాద్‌లో 888 కేసులు

మరోవైపు, ఈ రోజు వచ్చిన మొత్తం కేసుల్లో 888 పాజిటివ్‌ కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదుకావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 74, మేడ్చల్‌లో 37, నల్గొండలో 35 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

22:16 June 27

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

జిల్లాల వారిగా నమోదైన కేసుల వివరాలు
జిల్లాల వారిగా నమోదైన కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం కొనసాగుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు మరో 1087 కేసులు నమోదు కావడం తీవ్రంగా కలవర పెడుతోంది. శనివారం మొత్తం 3,923 శాంపిల్స్‌ను పరీక్షించగా.. వాటిలో 1087 పాజిటివ్‌గా తేలగా.. 2836 నెగెటివ్‌గా నిర్ధరణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13,436కి పెరిగింది. 

మరో ఆరు మరణాలు

రాష్ట్రంలో కొవిడ్‌ బారిన పడి మరో ఆరుగురు మృత్యువాత పడ్డారు. వైరస్​ బారిన పడి రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 243కి పెరిగింది. రాష్ట్రంలో ఈ రోజు మరో 162 మంది కోలుకున్నారు. ఇప్పటిదాకా డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4928కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8265 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

 

హైదరాబాద్‌లో 888 కేసులు

మరోవైపు, ఈ రోజు వచ్చిన మొత్తం కేసుల్లో 888 పాజిటివ్‌ కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదుకావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 74, మేడ్చల్‌లో 37, నల్గొండలో 35 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

Last Updated : Jun 27, 2020, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.