ETV Bharat / city

ఏజెన్సీ ప్రాంతాల్లో.. అంతరాలు తొలగాలి.. అభివృద్ధి జరగాలి - agency areas in Telangana

ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అభివృద్ధి అంతరాలు తొలగించాలని సామాజిక అభివృద్ధి మండలి అధ్యయనం సూచించింది. ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పేర్కొంది.

Development in Telangana Agency areas
ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి
author img

By

Published : Nov 9, 2020, 8:00 AM IST

రాష్ట్రంలో అత్యధిక ప్రాంతం ఏజెన్సీగా ఉన్న జిల్లాల్లో అభివృద్ధి అంతరాలను తొలగించాలని సామాజిక అభివృద్ధి మండలి అధ్యయనం సూచించింది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలంది. ఆరోగ్యం, విద్య, గృహవసతి, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పనకు ఓ కార్యాచరణను రూపొందించాలంది.

రాష్ట్రంలోని భద్రాద్రి-కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమురంభీం-ఆసిఫాబాద్‌ జిల్లాల్లో క్షేత్ర స్థాయి పరిస్థితులపై సామాజిక అభివృద్ధి మండలి (సీఎస్‌డీ) అధ్యయన నివేదికను విడుదల చేసింది. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) సహకారంతో రూపొందించిన ఈ నివేదికలో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, జలవనరులు, ఆర్థిక సమ్మిళితం, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు అనే కీలకాంశాలపై అధ్యయనం చేశారు.

అధ్యయనంలోని ప్రధానాంశాలు

* ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధికులు తాత్కాలిక నివాసాల్లోనే ఉన్నందున పక్కా గృహాల నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యంగా చేపట్టాలి.

* నాలుగు శాతం మంది యువతే నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్నందున దీనిపై విస్తృత అవగాహన పెంచాలి.

ఆరోగ్యం:

ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పునరుజ్జీవనం చేయడంతో పాటు అన్ని ఆవాస ప్రాంతాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

* నిత్యావసర సరకులు అందించే చౌకదుకాణాలు లేని గ్రామాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా పౌర సరఫరాల ఉప పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

* గర్భిణుల వివరాలను సకాలంలో నమోదు చేసి వారికి మెరుగైన వైద్యసేవలందించాలి. తరచూ వైద్య పరీక్షలను నిర్వహించాలి.

* ఆరోగ్య రిజిస్టర్లు నిర్వహించాలి. బాలామృతం పథకాన్ని పటిష్ఠం చేయాలి.

* ఏఎన్‌ఎం, ఆరోగ్య కేంద్రాలు, ఆశావర్కర్ల మధ్య సమన్వయం ఉండాలి.

* ప్రతి మండలానికి ప్రత్యేకంగా ప్రసూతి అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలి.

విద్య: విద్యార్థుల నమోదును పక్కాగా గుర్తించాలి.

పాఠశాలల్లో మెరుగైన బోధన వసతులు కల్పించాలి.

* చదవడం, లెక్కలు వేయడం వంటివి చేయగలిగేలా ఉండాలి.

* విద్య గురించి బాలికలకు అవగాహన కలిగించి డ్రాపవుట్‌లను తగ్గించాలి.

* విలేజ్‌ ఎడ్యుకేటర్‌ను నియమించాలి.

* పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉండాలి.

వ్యవసాయం: వ్యవసాయానికి మరింత అవకాశం ఉంది.

* ఉపాధి హామీలో చిన్ననీటి వనరులను పునరుద్ధరించాలి.

* నాణ్యమైన విత్తనాల లభ్యతను పెంచాలి. వ్యవసాయశాఖ సేవలను బలోపేతం చేయాలి.

* సంచార పశువైద్య ఆస్పత్రులు అందుబాటులో ఉండాలి.

* పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడంతో ఎక్కువమంది రైతుబంధు, రైతుబీమా లబ్ధిపొందలేకపోతున్నారు.

* సాగులోని భూమి, సాగునీటి వసతి ఉన్న భూముల మధ్య అంతరం ఉంది.

* చెరువులను పునరుద్ధరించాలి.

* అందరికీ బ్యాంకు ఖాతా ఉండాలి. కనీస వసతులు కల్పించాలి: అందరికీ ఇళ్లను నిర్మించే అంశాన్ని తక్షణ ప్రాధాన్యంగా తీసుకోవాలి.

* అన్ని గ్రామపంచాయతీలకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో కంప్యూటర్లను అందించాలి.

* రహదారుల్లేని గ్రామాల్లో వాటిని తక్షణ ప్రాధాన్యంగా చేపట్టాలి.

రాష్ట్రంలో అత్యధిక ప్రాంతం ఏజెన్సీగా ఉన్న జిల్లాల్లో అభివృద్ధి అంతరాలను తొలగించాలని సామాజిక అభివృద్ధి మండలి అధ్యయనం సూచించింది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలంది. ఆరోగ్యం, విద్య, గృహవసతి, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పనకు ఓ కార్యాచరణను రూపొందించాలంది.

రాష్ట్రంలోని భద్రాద్రి-కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమురంభీం-ఆసిఫాబాద్‌ జిల్లాల్లో క్షేత్ర స్థాయి పరిస్థితులపై సామాజిక అభివృద్ధి మండలి (సీఎస్‌డీ) అధ్యయన నివేదికను విడుదల చేసింది. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) సహకారంతో రూపొందించిన ఈ నివేదికలో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, జలవనరులు, ఆర్థిక సమ్మిళితం, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు అనే కీలకాంశాలపై అధ్యయనం చేశారు.

అధ్యయనంలోని ప్రధానాంశాలు

* ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధికులు తాత్కాలిక నివాసాల్లోనే ఉన్నందున పక్కా గృహాల నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యంగా చేపట్టాలి.

* నాలుగు శాతం మంది యువతే నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్నందున దీనిపై విస్తృత అవగాహన పెంచాలి.

ఆరోగ్యం:

ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పునరుజ్జీవనం చేయడంతో పాటు అన్ని ఆవాస ప్రాంతాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

* నిత్యావసర సరకులు అందించే చౌకదుకాణాలు లేని గ్రామాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా పౌర సరఫరాల ఉప పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

* గర్భిణుల వివరాలను సకాలంలో నమోదు చేసి వారికి మెరుగైన వైద్యసేవలందించాలి. తరచూ వైద్య పరీక్షలను నిర్వహించాలి.

* ఆరోగ్య రిజిస్టర్లు నిర్వహించాలి. బాలామృతం పథకాన్ని పటిష్ఠం చేయాలి.

* ఏఎన్‌ఎం, ఆరోగ్య కేంద్రాలు, ఆశావర్కర్ల మధ్య సమన్వయం ఉండాలి.

* ప్రతి మండలానికి ప్రత్యేకంగా ప్రసూతి అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలి.

విద్య: విద్యార్థుల నమోదును పక్కాగా గుర్తించాలి.

పాఠశాలల్లో మెరుగైన బోధన వసతులు కల్పించాలి.

* చదవడం, లెక్కలు వేయడం వంటివి చేయగలిగేలా ఉండాలి.

* విద్య గురించి బాలికలకు అవగాహన కలిగించి డ్రాపవుట్‌లను తగ్గించాలి.

* విలేజ్‌ ఎడ్యుకేటర్‌ను నియమించాలి.

* పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉండాలి.

వ్యవసాయం: వ్యవసాయానికి మరింత అవకాశం ఉంది.

* ఉపాధి హామీలో చిన్ననీటి వనరులను పునరుద్ధరించాలి.

* నాణ్యమైన విత్తనాల లభ్యతను పెంచాలి. వ్యవసాయశాఖ సేవలను బలోపేతం చేయాలి.

* సంచార పశువైద్య ఆస్పత్రులు అందుబాటులో ఉండాలి.

* పట్టాదారు పాసుపుస్తకాలు లేకపోవడంతో ఎక్కువమంది రైతుబంధు, రైతుబీమా లబ్ధిపొందలేకపోతున్నారు.

* సాగులోని భూమి, సాగునీటి వసతి ఉన్న భూముల మధ్య అంతరం ఉంది.

* చెరువులను పునరుద్ధరించాలి.

* అందరికీ బ్యాంకు ఖాతా ఉండాలి. కనీస వసతులు కల్పించాలి: అందరికీ ఇళ్లను నిర్మించే అంశాన్ని తక్షణ ప్రాధాన్యంగా తీసుకోవాలి.

* అన్ని గ్రామపంచాయతీలకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో కంప్యూటర్లను అందించాలి.

* రహదారుల్లేని గ్రామాల్లో వాటిని తక్షణ ప్రాధాన్యంగా చేపట్టాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.