ETV Bharat / city

హలో వెయిటర్​.. మెనూ ఎక్కడ..? ఇలా అడిగే రోజులు కావివి!

author img

By

Published : Jun 17, 2020, 4:22 PM IST

కరోనాతో హోటళ్లు, రెస్టారెంట్ల తీరు పూర్తిగా మారిపోయింది. మెనూ కనిపించదు. వాడి పడేసే కంచాల్లో తినాల్సిందే. హోటల్‌ యజమానులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... జనం అక్కడ తినేందుకు భయపడుతున్నారు. టేక్‌అవేలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

హలో వెయిటర్​.. మెనూ ఎక్కడ..? ఇలా అడిగే రోజులు కావివి!
హలో వెయిటర్​.. మెనూ ఎక్కడ..? ఇలా అడిగే రోజులు కావివి!

హలో వెయిటర్‌.. మెనూ ఎక్కడ..? ఏమేం ఉన్నాయ్‌..? ఏది బాగుంటుంది..? ఇలా అడిగే రోజులు కావివి.. ఏమున్నాయో సూచిక బోర్డు మీద చూసి, నచ్చింది తినేసి వచ్చేయడమే.. వెయిటర్‌కి టిప్పు ఇద్దామని రూ.ఇరవై ఇచ్చినా.. గూగుల్‌పే చేయండి అనే రోజులివి. ఇదే కాదు.. హోటల్‌ తలుపు వద్దే నమస్కారం చేసి సాదరంగా ఆహ్వానించే సెక్యూరిటీ గార్డు ఇప్పుడు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి.. చేతిలో శానిటైజర్‌ చల్లాకే లోపలికి పంపుతున్నాడు. ఆర్డర్‌ చేయగానే బల్లలపై ప్రత్యక్షమయ్యే ఫైబర్‌, రాగి కంచాలూ కనిపించవు.. వాడి పడేసే కంచాల్లో తినాల్సిందే. కరోనా నేపథ్యంలో పలు హోటళ్లలో ఇదే తంతు కనిపిస్తోంది. దీన్నే ఎవర్నీ తాకకుండా తినడం(కాంటాక్ట్‌ లెస్‌ డైనింగ్‌) పద్ధతి అంటున్నారు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండడంతో తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. టేక్‌అవేలోనూ ఇదే విధానం అవలంబిస్తున్నారు. ఫుడ్‌ డెలివరీ సంస్థలు ఇలాగే డెలివరీలు ఇస్తున్నాయి.

  • అన్ని హోటళ్లూ అదే బాట

దాదాపు రెండు నెలల లాక్‌డౌన్‌ తర్వాత హోటళ్లకు అనుమతి రావడంతో సిబ్బంది కొరత ఏర్పడింది. తక్కువ సిబ్బందితోనే కార్యకలాపాలు మొదలయ్యాయి. ఒక్కో హోటల్లో గతంలో పది నుంచి 20 మంది దాకా వెయిటర్లు, సహాయకులు పనిచేసేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య ఐదుగురి వరకే కన్పిస్తోంది. పాత కంచాలు, గ్లాసులన్నీ తీసి వాటి స్థానంలో వాడిపడేసే పళ్లాలు, గ్లాసులు వాడుతున్నారు. పలువురు తాకే అవకాశం ఉండడంతో మెనూ కార్డులనూ తీసేశారు. బదులుగా రాత, ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే బోర్డులపై ఆరోజు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల పేర్లు రాస్తున్నారు. వాటిని చూసి ఆర్డర్‌ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. భౌతిక దూరం తప్పనిసరి చేశారు.

  • టేక్‌అవేకే మొగ్గు

హోటల్లో అడుగు పెట్టే మొదలు నుంచి బయటికొచ్చే దాకా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జనం ఇక్కడ తినేందుకు భయపడుతున్నారని ఓ ప్రైవేట్‌ హోటల్‌ నిర్వాహకుడు చెప్పుకొచ్చారు. జొమాటో, స్విగ్గీ, ఉబర్‌ యాప్‌ల ద్వారానే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. ప్రముఖ హోటళ్లలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కరోజు 500 దాకా బిర్యానీలు అమ్మే ఓ ప్రముఖ హోటల్లో ఇప్పుడు కేవలం 25 శాతం మాత్రమే అమ్ముడవుతోంది.

  • ముట్టుకోకుండానే డెలివరీ

హోమ్‌ డెలివరీలపై భయాన్ని తొలగించేందుకే ‘కాంటాక్ట్‌లెస్‌ డెలివరీ’కీ ప్రయత్నిస్తున్నామని జొమాటో ప్రతినిధులు తెలిపారు. హోటల్‌, డెలివరీ సిబ్బంది ప్రత్యేక రక్షణ తీసుకుంటూ ఇంటికి చేరతారన్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం జొమాటో సంస్థ ఇప్పటివరకు నగరంలో దాదాపు 2 లక్షలకు పైగా డెలివరీలు చేసింది. ప్రస్తుతం రోజుకు వేయికి పైగా ఆర్డర్లు చేస్తోంది. బిల్లు చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లోనే తీసుకుంటోంది.

ఇదీ చదవండి: ఇద్దరూ శిరస్త్రాణం ధరించాల్సిందే... లేదంటే ఇక అంతే..!

హలో వెయిటర్‌.. మెనూ ఎక్కడ..? ఏమేం ఉన్నాయ్‌..? ఏది బాగుంటుంది..? ఇలా అడిగే రోజులు కావివి.. ఏమున్నాయో సూచిక బోర్డు మీద చూసి, నచ్చింది తినేసి వచ్చేయడమే.. వెయిటర్‌కి టిప్పు ఇద్దామని రూ.ఇరవై ఇచ్చినా.. గూగుల్‌పే చేయండి అనే రోజులివి. ఇదే కాదు.. హోటల్‌ తలుపు వద్దే నమస్కారం చేసి సాదరంగా ఆహ్వానించే సెక్యూరిటీ గార్డు ఇప్పుడు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి.. చేతిలో శానిటైజర్‌ చల్లాకే లోపలికి పంపుతున్నాడు. ఆర్డర్‌ చేయగానే బల్లలపై ప్రత్యక్షమయ్యే ఫైబర్‌, రాగి కంచాలూ కనిపించవు.. వాడి పడేసే కంచాల్లో తినాల్సిందే. కరోనా నేపథ్యంలో పలు హోటళ్లలో ఇదే తంతు కనిపిస్తోంది. దీన్నే ఎవర్నీ తాకకుండా తినడం(కాంటాక్ట్‌ లెస్‌ డైనింగ్‌) పద్ధతి అంటున్నారు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతుండడంతో తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. టేక్‌అవేలోనూ ఇదే విధానం అవలంబిస్తున్నారు. ఫుడ్‌ డెలివరీ సంస్థలు ఇలాగే డెలివరీలు ఇస్తున్నాయి.

  • అన్ని హోటళ్లూ అదే బాట

దాదాపు రెండు నెలల లాక్‌డౌన్‌ తర్వాత హోటళ్లకు అనుమతి రావడంతో సిబ్బంది కొరత ఏర్పడింది. తక్కువ సిబ్బందితోనే కార్యకలాపాలు మొదలయ్యాయి. ఒక్కో హోటల్లో గతంలో పది నుంచి 20 మంది దాకా వెయిటర్లు, సహాయకులు పనిచేసేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య ఐదుగురి వరకే కన్పిస్తోంది. పాత కంచాలు, గ్లాసులన్నీ తీసి వాటి స్థానంలో వాడిపడేసే పళ్లాలు, గ్లాసులు వాడుతున్నారు. పలువురు తాకే అవకాశం ఉండడంతో మెనూ కార్డులనూ తీసేశారు. బదులుగా రాత, ఎలక్ట్రానిక్‌ డిస్‌ప్లే బోర్డులపై ఆరోజు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల పేర్లు రాస్తున్నారు. వాటిని చూసి ఆర్డర్‌ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. భౌతిక దూరం తప్పనిసరి చేశారు.

  • టేక్‌అవేకే మొగ్గు

హోటల్లో అడుగు పెట్టే మొదలు నుంచి బయటికొచ్చే దాకా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జనం ఇక్కడ తినేందుకు భయపడుతున్నారని ఓ ప్రైవేట్‌ హోటల్‌ నిర్వాహకుడు చెప్పుకొచ్చారు. జొమాటో, స్విగ్గీ, ఉబర్‌ యాప్‌ల ద్వారానే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. ప్రముఖ హోటళ్లలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కరోజు 500 దాకా బిర్యానీలు అమ్మే ఓ ప్రముఖ హోటల్లో ఇప్పుడు కేవలం 25 శాతం మాత్రమే అమ్ముడవుతోంది.

  • ముట్టుకోకుండానే డెలివరీ

హోమ్‌ డెలివరీలపై భయాన్ని తొలగించేందుకే ‘కాంటాక్ట్‌లెస్‌ డెలివరీ’కీ ప్రయత్నిస్తున్నామని జొమాటో ప్రతినిధులు తెలిపారు. హోటల్‌, డెలివరీ సిబ్బంది ప్రత్యేక రక్షణ తీసుకుంటూ ఇంటికి చేరతారన్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం జొమాటో సంస్థ ఇప్పటివరకు నగరంలో దాదాపు 2 లక్షలకు పైగా డెలివరీలు చేసింది. ప్రస్తుతం రోజుకు వేయికి పైగా ఆర్డర్లు చేస్తోంది. బిల్లు చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లోనే తీసుకుంటోంది.

ఇదీ చదవండి: ఇద్దరూ శిరస్త్రాణం ధరించాల్సిందే... లేదంటే ఇక అంతే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.