ETV Bharat / city

క్వారంటైన్ ముద్ర వేసినా లెక్కచేయకుండా చిందులేసింది!

author img

By

Published : Mar 25, 2020, 8:12 AM IST

Updated : Mar 25, 2020, 8:44 AM IST

హోమ్​ క్వారంటైన్​ ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి కటకటాల పాలైంది ఓ మహిళ. సింగపూర్​ నుంచి వచ్చిన ఆమెను 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. కానీ లెక్కచేయకుండా ప్రియుడితో కలిసి చిందులేసింది. అపార్టుమెంటు వాసులు చూసి పోలీసులకు పట్టించారు.

corona suspect njoy with boy friend in boinpally
క్వారంటైన్ ముద్ర వేసిన లెక్కచేయకుండా చిందులేసింది!

సింగపూర్​ నుంచి వచ్చి హోమ్​ క్వారంటైన్​లో ఉండకుండా అర్ధరాత్రి వరకు చిందులేసిన ఓ మహిళపై బోయిన్​పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్​కు చెందిన ఆమె కొంతకాలంగా భర్త, పిల్లలతో కలిసి సింగపూర్​లో స్థిరపడింది. సెలవులపై నాలుగు రోజుల క్రితం నగరానికి వచ్చింది. విమానాశ్రయంలో అధికారులు కరోనా పరీక్షలు చేసి చేతిపై ముద్ర వేసి హోం క్వారంటైన్​లోనే ఉండాలని చెప్పి పంపారు.

ఆమె స్వస్థలానికి చేరుకోకుండా ఓల్డ్​ బోయిన్​పల్లి రాజారెడ్డి కాలనీలో గల సాయిరెసిడెన్సీలో ఓ ఫ్లాట్​కు చేరుకుంది. ఓ యువకుడి​తో కలిసి ఆదివారం నాడు అర్ధరాత్రి వరకు పార్టీ చేసుకుంది. మద్యం తాగి ఇష్టానుసారంగా చిందులేసింది. గమనించిన అపార్ట్​మెంటు వాసులు సోమవారం సాయంత్రం మహిళను నిలదీశారు. ఆ సమయంలోనే ఆమె చేతికి క్వారంటైన్​ స్టాంప్​ గమనించారు. వెంటనే బంధించి పోలీసులకు సమాచారం అందించారు.

మహిళను, యువకుడిని పోలీసులు విచారించగా... అతను బాయ్​ఫ్రెండ్​ అని తేలింది. వారిద్దరిపై కేసు నమోదు చేసి ప్రభుత్వ క్వారంటైన్​ కేంద్రానికి తరలించారు. ఆ ఫ్లాట్​ ఎవరిది? అక్కడ ఆమె ఇంకా ఏం చేసింది? ఎవరెవరిని కలిసింది? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

క్వారంటైన్ ముద్ర వేసిన లెక్కచేయకుండా చిందులేసింది!

సింగపూర్​ నుంచి వచ్చి హోమ్​ క్వారంటైన్​లో ఉండకుండా అర్ధరాత్రి వరకు చిందులేసిన ఓ మహిళపై బోయిన్​పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్​కు చెందిన ఆమె కొంతకాలంగా భర్త, పిల్లలతో కలిసి సింగపూర్​లో స్థిరపడింది. సెలవులపై నాలుగు రోజుల క్రితం నగరానికి వచ్చింది. విమానాశ్రయంలో అధికారులు కరోనా పరీక్షలు చేసి చేతిపై ముద్ర వేసి హోం క్వారంటైన్​లోనే ఉండాలని చెప్పి పంపారు.

ఆమె స్వస్థలానికి చేరుకోకుండా ఓల్డ్​ బోయిన్​పల్లి రాజారెడ్డి కాలనీలో గల సాయిరెసిడెన్సీలో ఓ ఫ్లాట్​కు చేరుకుంది. ఓ యువకుడి​తో కలిసి ఆదివారం నాడు అర్ధరాత్రి వరకు పార్టీ చేసుకుంది. మద్యం తాగి ఇష్టానుసారంగా చిందులేసింది. గమనించిన అపార్ట్​మెంటు వాసులు సోమవారం సాయంత్రం మహిళను నిలదీశారు. ఆ సమయంలోనే ఆమె చేతికి క్వారంటైన్​ స్టాంప్​ గమనించారు. వెంటనే బంధించి పోలీసులకు సమాచారం అందించారు.

మహిళను, యువకుడిని పోలీసులు విచారించగా... అతను బాయ్​ఫ్రెండ్​ అని తేలింది. వారిద్దరిపై కేసు నమోదు చేసి ప్రభుత్వ క్వారంటైన్​ కేంద్రానికి తరలించారు. ఆ ఫ్లాట్​ ఎవరిది? అక్కడ ఆమె ఇంకా ఏం చేసింది? ఎవరెవరిని కలిసింది? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

క్వారంటైన్ ముద్ర వేసిన లెక్కచేయకుండా చిందులేసింది!
Last Updated : Mar 25, 2020, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.