ETV Bharat / city

కరోనాతో విజయవాడ రైల్వే డివిజన్​లో తగ్గిన ఆదాయం

author img

By

Published : Apr 10, 2021, 11:51 AM IST

ఆదాయ ఆర్జనలో ముందుండే ఏపీలోని విజయవాడ డివిజన్... కొవిడ్ దెబ్బతో వెనుకబడింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 21 శాతం తక్కువ ఆదాయాన్ని ఆర్జించింది. సరుకు రవాణాను తగ్గించడం వల్లే ఆదాయం తగ్గినట్లు విజయవాడ డీఆర్​ఎం శ్రీనివాస్ తెలిపారు.

corona effect on vijayawada division
విజయవాడ రైల్వే డివిజన్

కరోనా ప్రభావం... రైల్వే ఆదాయంపై గణనీయంగా పడింది. ఆదాయ ఆర్జనలో ఏటా ముందుండే ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ డివిజన్... కొవిడ్ దెబ్బతో వెనుకబడింది. గతేడాది మార్చి నుంచి ఏప్రిల్ వరకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2వేల 494 కోట్లు ఆదాయాన్ని మాత్రమే నమోదు చేసింది. వీటిలో సరుకు రవాణా ద్వారా రూ. 2వేల 197.27 కోట్లు ఆదాయం ఆర్జించింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 21 శాతం తక్కువ. లాక్​డౌన్ కారణంగా సరుకు రవాణాను తగ్గించడం వల్లే ఆదాయం తగ్గినట్లు విజయవాడ డీఆర్​ఎం శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు.

గతేడాది ప్రయాణికుల రవాణా ద్వారా విజయవాడ డివిజన్ రూ. 219.84 కోట్లు మాత్రమే ఆర్జించింది. డివిజన్ వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసినట్లు శ్రీనివాస్​ చెప్పారు. విజయవాడ రైల్వేస్టేషన్​ను ఆధునికీకరించి ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. డివిజన్​లో పెండింగ్​లో ఉన్న నిర్మాణాలు సహా డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులను పూర్తి చేశామని... మిగిలినవి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీనివాస్ వివరించారు.

ఇదీ చదవండి: ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కొవిడ్ చికిత్సకు సర్కారు నిర్ణయం

కరోనా ప్రభావం... రైల్వే ఆదాయంపై గణనీయంగా పడింది. ఆదాయ ఆర్జనలో ఏటా ముందుండే ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ డివిజన్... కొవిడ్ దెబ్బతో వెనుకబడింది. గతేడాది మార్చి నుంచి ఏప్రిల్ వరకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2వేల 494 కోట్లు ఆదాయాన్ని మాత్రమే నమోదు చేసింది. వీటిలో సరుకు రవాణా ద్వారా రూ. 2వేల 197.27 కోట్లు ఆదాయం ఆర్జించింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 21 శాతం తక్కువ. లాక్​డౌన్ కారణంగా సరుకు రవాణాను తగ్గించడం వల్లే ఆదాయం తగ్గినట్లు విజయవాడ డీఆర్​ఎం శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు.

గతేడాది ప్రయాణికుల రవాణా ద్వారా విజయవాడ డివిజన్ రూ. 219.84 కోట్లు మాత్రమే ఆర్జించింది. డివిజన్ వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసినట్లు శ్రీనివాస్​ చెప్పారు. విజయవాడ రైల్వేస్టేషన్​ను ఆధునికీకరించి ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. డివిజన్​లో పెండింగ్​లో ఉన్న నిర్మాణాలు సహా డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులను పూర్తి చేశామని... మిగిలినవి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీనివాస్ వివరించారు.

ఇదీ చదవండి: ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కొవిడ్ చికిత్సకు సర్కారు నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.