ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్​: ఫిట్​నెస్​ పెంచే జిమ్​లు.. ఫైనాన్షియల్​గా దిగాలు

కరోనా అన్నిరంగాలపై... తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్‌ ఎక్కడ అంటుకుంటుందో అర్థంకాక జనం సతమతమవుతున్నారు. సాధ్యమైనంత వరకు కొవిడ్‌ సోకే అవకాశాలు ఉన్నాయని అనుమానించే చోటుకు వెళ్లకుండా జాగ్రత్తపడతున్నారు. జిమ్‌లకు వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు. ఫలితంగా స్వయం ఉపాధి కింద అప్పులు చేసి జిమ్‌లు ఏర్పాటు చేసుకున్న యువకులు ఆర్థికంగా చితికిపోతున్నారు.

author img

By

Published : May 8, 2021, 8:34 PM IST

corona effect on gyms and financially dull in pandemic time
corona effect on gyms and financially dull in pandemic time
ఫిట్​నెస్​ పెంచే జిమ్​లు.. ఫైనాన్షియల్​గా దిగాలు
గతేడాది లాక్‌డౌన్‌ పరిణామాలతో... దాదాపు 9 నెలలపాటు జిమ్‌లకు తాళాలు తీయలేదు. క్రమంగా మినహాయింపుల్లో భాగంగా ఫిట్‌నెస్‌ సెంటర్లు నెమ్మదిగా తెరుచుకున్నాయి. కొద్దిమంది భయంభయంగా జిమ్‌లకు వచ్చారు. కొద్దిరోజుల క్రితం కొవిడ్‌ నుంచి సాధారణ పరిస్థితులు నెలకొనగా... మళ్లీ ఆదరణ పెరిగింది. శారీరక ధృఢత్వం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి కరోనాను ఎదుర్కోవచ్చనే వైద్యుల సూచనతో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చారు. ఇంతలోనే కొవిడ్‌ విజృభించగా ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలుతో 8 గంటలకే జిమ్‌లు మూసేస్తుడటం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు.

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌ వ్యాయామాలు చేయిస్తున్నట్లు జిమ్‌ల నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్వాస సమస్యలు అధిగమించేలా శిక్షణ ఇస్తున్నామని వివరిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిచెందకుండా వ్యాయామశాలలను రెండుగంటలకు ఒకసారి పూర్తిగా శానిటైజేషన్‌ చేయడం సహా . థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నామని.. మాస్క్, భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.

"ప్రతీ ఇంట్లోనూ కరోనాతో ఆందోళన నెలకొంది. చిన్నాపెద్దా శారీరక దృఢత్వంపై దృష్టి పెడితే మంచిది. అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. జిమ్‌కు రావడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మంచి ఆహార నియమాలు పాటించేలా చూస్తాం. జిమ్‌లో గంటకోసారి శానిటైజేషన్‌తో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడున్న సమయం సరిపోవడం లేదు. ఉదయం 5 గంటలకు తెరిచి.. రాత్రి 8 గంటలకే జిమ్‌లు మూసివేస్తున్నాం. మరికొంచెం సమయం పెంచాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం."

- వ్యాయామ శిక్షకుడు

గ్రేటర్ పరిధిలో సుమారు 150 వరకు పెద్ద జిమ్‌లు ఉన్నాయి. చిన్నవి 700లకు పైగానే ఉంటాయని జిమ్ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. శానిటైజేషన్​ తదితర ఖర్చులు పెరిగినా ఫీజులు మాత్రం పాతవే వసూలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని జిమ్‌ సెంటర్ల యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: కరోనా కట్టడికి రాష్ట్రాల 'లాక్​డౌన్' అస్త్రం

ఫిట్​నెస్​ పెంచే జిమ్​లు.. ఫైనాన్షియల్​గా దిగాలు
గతేడాది లాక్‌డౌన్‌ పరిణామాలతో... దాదాపు 9 నెలలపాటు జిమ్‌లకు తాళాలు తీయలేదు. క్రమంగా మినహాయింపుల్లో భాగంగా ఫిట్‌నెస్‌ సెంటర్లు నెమ్మదిగా తెరుచుకున్నాయి. కొద్దిమంది భయంభయంగా జిమ్‌లకు వచ్చారు. కొద్దిరోజుల క్రితం కొవిడ్‌ నుంచి సాధారణ పరిస్థితులు నెలకొనగా... మళ్లీ ఆదరణ పెరిగింది. శారీరక ధృఢత్వం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి కరోనాను ఎదుర్కోవచ్చనే వైద్యుల సూచనతో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చారు. ఇంతలోనే కొవిడ్‌ విజృభించగా ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలుతో 8 గంటలకే జిమ్‌లు మూసేస్తుడటం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు.

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌ వ్యాయామాలు చేయిస్తున్నట్లు జిమ్‌ల నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్వాస సమస్యలు అధిగమించేలా శిక్షణ ఇస్తున్నామని వివరిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తిచెందకుండా వ్యాయామశాలలను రెండుగంటలకు ఒకసారి పూర్తిగా శానిటైజేషన్‌ చేయడం సహా . థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నామని.. మాస్క్, భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.

"ప్రతీ ఇంట్లోనూ కరోనాతో ఆందోళన నెలకొంది. చిన్నాపెద్దా శారీరక దృఢత్వంపై దృష్టి పెడితే మంచిది. అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. జిమ్‌కు రావడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మంచి ఆహార నియమాలు పాటించేలా చూస్తాం. జిమ్‌లో గంటకోసారి శానిటైజేషన్‌తో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడున్న సమయం సరిపోవడం లేదు. ఉదయం 5 గంటలకు తెరిచి.. రాత్రి 8 గంటలకే జిమ్‌లు మూసివేస్తున్నాం. మరికొంచెం సమయం పెంచాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం."

- వ్యాయామ శిక్షకుడు

గ్రేటర్ పరిధిలో సుమారు 150 వరకు పెద్ద జిమ్‌లు ఉన్నాయి. చిన్నవి 700లకు పైగానే ఉంటాయని జిమ్ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. శానిటైజేషన్​ తదితర ఖర్చులు పెరిగినా ఫీజులు మాత్రం పాతవే వసూలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని జిమ్‌ సెంటర్ల యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: కరోనా కట్టడికి రాష్ట్రాల 'లాక్​డౌన్' అస్త్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.