ETV Bharat / city

శ్రీవారి ఆర్జిత సేవల ధరలు పెంచాలన్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు

author img

By

Published : Feb 20, 2022, 3:42 PM IST

controversy on TTD tickets rates increase : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ధరలు పెంచాలని ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుప్రభాతం మొదలు అభిషేకం వరకు అన్ని సేవల టికెట్ల ధరలను నాలుగు నుంచి ఐదు రెట్లు పెంచాలన్న ప్రతిపాదనను తితిదే బోర్డు సభ్యులు ఆమోదించడంపై భక్తులు పెదవివిరుస్తున్నారు. విచ్చలవిడిగా ధరల పెంపుతో సామాన్య, పేద భక్తులకు శ్రీవారి దర్శనం మరింత క్లిష్టమయ్యే పరిస్థితి నెలకొంటుందని అభిప్రాయపడుతున్నారు.

controversy  on TTD Seva tickets rates increase, ttd earned services
శ్రీవారి ఆర్జిత సేవల ధరలు పెంచాలన్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు

శ్రీవారి ఆర్జిత సేవల ధరలు పెంచాలన్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు

controversy on TTD tickets rates increase : తిరుమలేశుడి ఆర్జిత సేవల టికెట్లను పెంచాలని తితిదే ఇటీవలె నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న ధరలను నాలుగు నుంచి ఐదు రెట్లు పెంచాలని దేవస్థాన ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. సుప్రభాత సేవను రూ. 8వందల నుంచి రూ. 2 వేలకు.. అదే విధంగా కల్యాణోత్సవం, అర్చన, తోమాల సేవలను రూ.ఐదువేలకు పెంచాలని తీర్మానం చేశారు. సిఫార్సు లేఖలతో ఆర్జిత సేవలు కోరుకునే భక్తులపై అధిక భారం మోపడం తప్పేమీ కాదని ఛైర్మన్‌ చెప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుపై ధర్మకర్తల మండలి నిర్ణయాన్ని భక్తులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలను ఒకేసారి ఐదు రెట్లు పెంచడంతో స్వామి వారి దర్శనం సాధారణ భక్తులకు భారంగా మారుతుందంటున్నారు. ధార్మిక సంస్థ తితిదేను వ్యాపార సంస్థగా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుతోపాటు ఇప్పటికే తిరుమలలో వసతిగృహాల అద్దెలను భారీగా పెంచారు. మరో వైపు లడ్డూ ప్రసాదాలను సైతం రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. గడచిన మూడేళ్లలో తిరుమలలో అన్ని ధరలు పెరగడం తప్ప. భక్తులకు మౌలిక సదుపాయాలు మాత్రం మెరుగుపడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రపంచప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వ్యాపారకేంద్రంగా మారుస్తున్నారు. సామాన్య భక్తులకు ఎన్ని టికెట్లు ఇస్తున్నారు. ఆదాయం తప్పా... భక్తులు సంతృప్తిగా స్వామివారిని చూస్తున్నారా? అనే ఆలోచన లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ధరలు పెంచే హక్కు ధర్మకర్తలకు ఎవరిచ్చారు. ఇప్పటికైనా పీఠాధిపతులు ప్రశ్నించాలి. ఇంత దారుణంగా హిందూ సనాతన ధర్మం మీద ధరలు పెంచి... తిరుమల కొండకు రావాలంటే సామాన్యులు భయపడేలా చేస్తున్నారు.

-నవీన్ కుమార్ రెడ్డి, భక్తుడు

ఆర్జిత సేవా టికెట్లు లభించడమే చాలా కష్టమే. అది కూడా సామాన్యులకు చాలా తక్కువ. ఒకవేళ మిగిలిపోయిన టికెట్లు ఉన్నా... వాటిని తీసుకోవాలంటే పెంచిన ధరల కారణంగా పేదవారు, సామాన్య భక్తులు ఆర్జిత సేవలకు భక్తులు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ధరలు పెంచకుండా ఉండాలి... ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి.

-శ్రీనివాస్, భక్తుడు

ఇదీ చదవండి:

శ్రీవారి ఆర్జిత సేవల ధరలు పెంచాలన్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు

controversy on TTD tickets rates increase : తిరుమలేశుడి ఆర్జిత సేవల టికెట్లను పెంచాలని తితిదే ఇటీవలె నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న ధరలను నాలుగు నుంచి ఐదు రెట్లు పెంచాలని దేవస్థాన ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. సుప్రభాత సేవను రూ. 8వందల నుంచి రూ. 2 వేలకు.. అదే విధంగా కల్యాణోత్సవం, అర్చన, తోమాల సేవలను రూ.ఐదువేలకు పెంచాలని తీర్మానం చేశారు. సిఫార్సు లేఖలతో ఆర్జిత సేవలు కోరుకునే భక్తులపై అధిక భారం మోపడం తప్పేమీ కాదని ఛైర్మన్‌ చెప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుపై ధర్మకర్తల మండలి నిర్ణయాన్ని భక్తులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలను ఒకేసారి ఐదు రెట్లు పెంచడంతో స్వామి వారి దర్శనం సాధారణ భక్తులకు భారంగా మారుతుందంటున్నారు. ధార్మిక సంస్థ తితిదేను వ్యాపార సంస్థగా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుతోపాటు ఇప్పటికే తిరుమలలో వసతిగృహాల అద్దెలను భారీగా పెంచారు. మరో వైపు లడ్డూ ప్రసాదాలను సైతం రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. గడచిన మూడేళ్లలో తిరుమలలో అన్ని ధరలు పెరగడం తప్ప. భక్తులకు మౌలిక సదుపాయాలు మాత్రం మెరుగుపడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రపంచప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వ్యాపారకేంద్రంగా మారుస్తున్నారు. సామాన్య భక్తులకు ఎన్ని టికెట్లు ఇస్తున్నారు. ఆదాయం తప్పా... భక్తులు సంతృప్తిగా స్వామివారిని చూస్తున్నారా? అనే ఆలోచన లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ధరలు పెంచే హక్కు ధర్మకర్తలకు ఎవరిచ్చారు. ఇప్పటికైనా పీఠాధిపతులు ప్రశ్నించాలి. ఇంత దారుణంగా హిందూ సనాతన ధర్మం మీద ధరలు పెంచి... తిరుమల కొండకు రావాలంటే సామాన్యులు భయపడేలా చేస్తున్నారు.

-నవీన్ కుమార్ రెడ్డి, భక్తుడు

ఆర్జిత సేవా టికెట్లు లభించడమే చాలా కష్టమే. అది కూడా సామాన్యులకు చాలా తక్కువ. ఒకవేళ మిగిలిపోయిన టికెట్లు ఉన్నా... వాటిని తీసుకోవాలంటే పెంచిన ధరల కారణంగా పేదవారు, సామాన్య భక్తులు ఆర్జిత సేవలకు భక్తులు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ధరలు పెంచకుండా ఉండాలి... ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి.

-శ్రీనివాస్, భక్తుడు

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.