ETV Bharat / city

congress protest: నేడు పెట్రోల్​ ధరల పెంపుపై కాంగ్రెస్​ రాష్ట్రవ్యాప్త నిరసన

ప్రజా సమస్యలపై పోరాటానికి కాంగ్రెస్‌ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఏఐసీసీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధరల పెంపుపై నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. యువతను ఆకర్షించేందుకు నిరుద్యోగ సమస్యపైనా పోరాటం చేయాలని నిర్ణయించిన టీపీసీసీ .. 48 గంటల దీక్షకు సమాయత్తవుతోంది.

author img

By

Published : Jul 12, 2021, 6:54 AM IST

congress protest
congress protest

పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుంచే కార్యాచరణ సిద్ధం చేసిన రేవంత్‌ రెడ్డి.. ప్రజాసమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పెట్రో ధరల పెంపుపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ఇన్‌ఛార్జీలను నియమించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో సైకిళ్లను, రిక్షాలను, ఎడ్లబండ్లను ఉపయోగించి నిరసన ప్రదర్శనలు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఈ ఉదయం 11 గంటలకు నిర్మల్‌లో పెట్రోధరలపై నిరసన చేపట్టనున్నారు. ఆయా జిల్లాల్లోనూ ఇన్‌ఛార్జిల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగనున్నాయి.

యువతను ఆకర్షించేందుకు..

యువతను పార్టీకి దగ్గర చేసుకునేందుకు.. నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులెన్ని? ఇప్పటి వరకు భర్తీ చేయకుండా ప్రభుత్వం నాన్చివేత ధోరణిపైనా సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది. తెరాస, భాజపాను ఎదుర్కొనేందుకు కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపాలని హస్తం పార్టీ యోచిస్తోంది. మండల, నియోజకవర్గ స్థాయిలతో పాటు వివిధ విభాగాలకు చెందిన పార్టీ ప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహించాలనుకుంటోంది. తదనంతరం స్వేచ్ఛ, స్వయం పాలన, సామాజిక న్యాయం నినాదాలతో జిల్లాల పర్యటనకు కొత్త పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెళ్లేలా.. ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్న బడుగు బలహీన వర్గాలను దగ్గర చేసుకునేందుకు కార్యాచరణ రూపకల్పన జరుగుతోంది.

హుజూరాబాద్​ ఉపఎన్నికపైనా...

హుజూరాబాద్‌ ఉప ఎన్నికపైనా పీసీసీ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ ఎన్నిక బాధ్యతలను పీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ దామోదర్‌ రాజనర్సింహకు అప్పగించారు. అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసి.. కార్యవర్గంలో చర్చించి....ఎవరిని బరిలో నిలపాలన్న అంశంపై తుదినిర్ణయం తీసుకొని హైకమాండ్‌కి నివేదించనున్నారు. ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా.. పీసీసీ కార్యవర్గంలో చర్చించి సమష్టి నిర్ణయంతో ముందుకెళ్తే అంతర్గతంగా విమర్శలకు తావులేకుండా ఉంటుందని రేవంత్‌ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్‌ నేతలను సైతం దగ్గరకు చేసుకునేలా కార్యక్రమాల రూపకల్పన జరుగుతోంది.

ఇవీచూడండి: JOB NOTIFICATION: ప్రభుత్వ శాఖల్లో 55 వేల ఉద్యోగ ఖాళీలు!

పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుంచే కార్యాచరణ సిద్ధం చేసిన రేవంత్‌ రెడ్డి.. ప్రజాసమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పెట్రో ధరల పెంపుపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ ఇన్‌ఛార్జీలను నియమించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో సైకిళ్లను, రిక్షాలను, ఎడ్లబండ్లను ఉపయోగించి నిరసన ప్రదర్శనలు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఈ ఉదయం 11 గంటలకు నిర్మల్‌లో పెట్రోధరలపై నిరసన చేపట్టనున్నారు. ఆయా జిల్లాల్లోనూ ఇన్‌ఛార్జిల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగనున్నాయి.

యువతను ఆకర్షించేందుకు..

యువతను పార్టీకి దగ్గర చేసుకునేందుకు.. నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులెన్ని? ఇప్పటి వరకు భర్తీ చేయకుండా ప్రభుత్వం నాన్చివేత ధోరణిపైనా సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది. తెరాస, భాజపాను ఎదుర్కొనేందుకు కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపాలని హస్తం పార్టీ యోచిస్తోంది. మండల, నియోజకవర్గ స్థాయిలతో పాటు వివిధ విభాగాలకు చెందిన పార్టీ ప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహించాలనుకుంటోంది. తదనంతరం స్వేచ్ఛ, స్వయం పాలన, సామాజిక న్యాయం నినాదాలతో జిల్లాల పర్యటనకు కొత్త పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెళ్లేలా.. ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్న బడుగు బలహీన వర్గాలను దగ్గర చేసుకునేందుకు కార్యాచరణ రూపకల్పన జరుగుతోంది.

హుజూరాబాద్​ ఉపఎన్నికపైనా...

హుజూరాబాద్‌ ఉప ఎన్నికపైనా పీసీసీ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ ఎన్నిక బాధ్యతలను పీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ దామోదర్‌ రాజనర్సింహకు అప్పగించారు. అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసి.. కార్యవర్గంలో చర్చించి....ఎవరిని బరిలో నిలపాలన్న అంశంపై తుదినిర్ణయం తీసుకొని హైకమాండ్‌కి నివేదించనున్నారు. ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా.. పీసీసీ కార్యవర్గంలో చర్చించి సమష్టి నిర్ణయంతో ముందుకెళ్తే అంతర్గతంగా విమర్శలకు తావులేకుండా ఉంటుందని రేవంత్‌ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్‌ నేతలను సైతం దగ్గరకు చేసుకునేలా కార్యక్రమాల రూపకల్పన జరుగుతోంది.

ఇవీచూడండి: JOB NOTIFICATION: ప్రభుత్వ శాఖల్లో 55 వేల ఉద్యోగ ఖాళీలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.