ETV Bharat / city

వైద్య సిబ్బందిని భర్తీ చేయాలి : కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి - Telangana Assembly Sessions

రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులపై ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్​ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి ప్రశ్నించారు. ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది లేక ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదని.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలైనా ప్రజారోగ్యం గాడిన పెట్టలేకపోయారని మండిపడ్డారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు మంత్రి ఈటల దీటుగా జవాబిచ్చారు. తెలంగాణ సాధించిన బాధ్యతతోనే.. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతామని అందుకు నిబద్ధులమై పని చేస్తున్నామని అన్నారు.

Congress MLA Questions To Minister rajender In Assembly
వైద్య సిబ్బందిని భర్తీ చేయాలి : కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి
author img

By

Published : Sep 10, 2020, 1:30 PM IST

రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చి ఆరేళ్లు పూర్తి కావస్తున్నా.. ఇప్పటి వరకు పేదలకు సరైన వైద్య సదుపాయాలు లేవని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి అసెంబ్లీలో గళమెత్తారు. ఉద్యమకారులే పాలకులైనా.. ప్రజల పరిస్థితి మారలేదన్నారు. ఆస్పత్రి భవనాలు కడితే సరిపోదు.. ఆస్పత్రుల్లో వైద్యులు, సరిపడా సిబ్బందిని కూడా నియమించాలని ధ్వజమెత్తారు.

వైద్య సిబ్బందిని భర్తీ చేయాలి : కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి

కోమటిరెడ్డి ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ సైతం దీటుగా జవాబిచ్చారు. యాభై సంవత్సరాల వలస పాలనలో తెలంగాణకు ఒక్క మెడికల్​ కళాశాల కూడా రాలేదని, తెలంగాణ వచ్చిన వెంటనే ఆరు మెడికల్​ కాలేజీలా సాధించామని గుర్తు చేశారు. ఒక బాధ్యతతో తెలంగాణ సాధించామని.. అదే బాధ్యతతో తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్​ కాపాడుకుంటారని మంత్రి సమాధానమిచ్చారు. ఇప్పటికే.. ఐదువేల సిబ్బందిని నియమించుకున్నట్టు.. కరోనా వల్ల వైద్య సిబ్బంది అంతా కరోనా సేవల్లో ఉన్నట్టు మంత్రి తెలిపారు. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత మరో ఆరువేల మంది వైద్య సిబ్బందిని నియమించుకోనున్నట్టు మంత్రి తెలిపారు.

ఇవీ చూడండి: రఫేల్​ జెట్ల​ విన్యాసాలు- శత్రువుల గుండెల్లో గుబులు

రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చి ఆరేళ్లు పూర్తి కావస్తున్నా.. ఇప్పటి వరకు పేదలకు సరైన వైద్య సదుపాయాలు లేవని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి అసెంబ్లీలో గళమెత్తారు. ఉద్యమకారులే పాలకులైనా.. ప్రజల పరిస్థితి మారలేదన్నారు. ఆస్పత్రి భవనాలు కడితే సరిపోదు.. ఆస్పత్రుల్లో వైద్యులు, సరిపడా సిబ్బందిని కూడా నియమించాలని ధ్వజమెత్తారు.

వైద్య సిబ్బందిని భర్తీ చేయాలి : కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి

కోమటిరెడ్డి ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ సైతం దీటుగా జవాబిచ్చారు. యాభై సంవత్సరాల వలస పాలనలో తెలంగాణకు ఒక్క మెడికల్​ కళాశాల కూడా రాలేదని, తెలంగాణ వచ్చిన వెంటనే ఆరు మెడికల్​ కాలేజీలా సాధించామని గుర్తు చేశారు. ఒక బాధ్యతతో తెలంగాణ సాధించామని.. అదే బాధ్యతతో తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్​ కాపాడుకుంటారని మంత్రి సమాధానమిచ్చారు. ఇప్పటికే.. ఐదువేల సిబ్బందిని నియమించుకున్నట్టు.. కరోనా వల్ల వైద్య సిబ్బంది అంతా కరోనా సేవల్లో ఉన్నట్టు మంత్రి తెలిపారు. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత మరో ఆరువేల మంది వైద్య సిబ్బందిని నియమించుకోనున్నట్టు మంత్రి తెలిపారు.

ఇవీ చూడండి: రఫేల్​ జెట్ల​ విన్యాసాలు- శత్రువుల గుండెల్లో గుబులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.