ETV Bharat / city

నేడు గాంధీభవన్​లో కాంగ్రెస్​ నేతల భేటీ - నేడు గాంధీభవన్​లో కాంగ్రెస్​ నేతల భేటీ

బడ్జెట్​ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్​ నేతలు ఇవాళ భేటీ కానున్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్​ నేతలు ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

నేడు గాంధీభవన్​లో కాంగ్రెస్​ నేతల భేటీ
author img

By

Published : Sep 6, 2019, 11:59 PM IST

నేడు గాంధీభవన్​లో కాంగ్రెస్​ నేతల భేటీ

శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్​ నేతలు ఇవాళ సమావేశం కానున్నారు. ఈ నెల 9 నుంచి జరగనున్న బడ్జెట్‌ సమావేశాల్లో ఏయే అంశాలు ప్రస్తావించాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. గాంధీభవన్లో జరిగే ఈ భేటీకి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విజృంభిస్తున్న విషజ్వరాలు, సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనుంది.

ఇవీ చూడండి: కేసీఆర్​ది కలియుగ రాచరిక పాలన: ఎంపీ రేవంత్ రెడ్డి

నేడు గాంధీభవన్​లో కాంగ్రెస్​ నేతల భేటీ

శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్​ నేతలు ఇవాళ సమావేశం కానున్నారు. ఈ నెల 9 నుంచి జరగనున్న బడ్జెట్‌ సమావేశాల్లో ఏయే అంశాలు ప్రస్తావించాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. గాంధీభవన్లో జరిగే ఈ భేటీకి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విజృంభిస్తున్న విషజ్వరాలు, సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనుంది.

ఇవీ చూడండి: కేసీఆర్​ది కలియుగ రాచరిక పాలన: ఎంపీ రేవంత్ రెడ్డి

Intro:Body:

hyd_82_06


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.