అవినీతి కోసమే కేసీఆర్ నూతన పథకాలు ప్రవేశపెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల ఆరోపించారు. ఆగస్టు 15 నుంచి ప్రజారంజక పాలన చేస్తానన్న కేసీఆర్... గత ఐదేళ్లుగా ప్రజాకంఠక పాలన చేశారా.. అన్ని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు అమలు కాలేదన్నారు. ప్రజాప్రతినిధులు నాటిన మొక్కలు కనపడకపోతే ఉద్యోగాలు పోతాయంటున్న ముఖ్యమంత్రి.. తాను చేసిన అన్యాయాలపై ఎలాంటి శిక్ష వేయాలో తెలపాలన్నారు. కొత్త చట్టాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.
ఇవీ చూడండి: 'యురేనియం తవ్వకాలతో రాష్ట్రం విషతుల్యమవుతుంది'