ETV Bharat / city

పీవీ నరసింహారావుకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

author img

By

Published : Jun 28, 2020, 10:50 AM IST

పీవీ నరసింహారావు చిత్రపటంకు సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

CM KCR paid tribute to PV Narasimha Rao
పీవీ నరసింహారావుకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌నెక్లెస్​రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు మంత్రులు నివాళులర్పించారు. పీవీ శత జయంత్యుత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సభాపతి పోచారం, కేశవరావు, మంత్రులు కేటీఆర్, తలసాని, ఈటల, కాంగ్రెస్​ నేతలు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొన్నం, ఇతర పార్టీల నేతలు, పీవీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఏడాది పొడవునా పీవీ జయంత్యుత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌నెక్లెస్​రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు మంత్రులు నివాళులర్పించారు. పీవీ శత జయంత్యుత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సభాపతి పోచారం, కేశవరావు, మంత్రులు కేటీఆర్, తలసాని, ఈటల, కాంగ్రెస్​ నేతలు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొన్నం, ఇతర పార్టీల నేతలు, పీవీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఏడాది పొడవునా పీవీ జయంత్యుత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి : పీవీకి సరైన గౌరవం దక్కలేదా? వంగర వాసులు ఏమంటున్నారు?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.