ఏపీ సీఎం జగన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ గంగిరెడ్డి మరణించారు. వైఎస్ భారతి తండ్రి మృతితో ముఖ్యమంత్రి ఇంట విషాదం నెలకొంది. గంగిరెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలిస్తున్నారు.
గంగిరెడ్డి అంత్యక్రియలు స్వగ్రామం వేముల మండలం గొల్లల గూడూరులో జరగనున్నాయి. మధ్యాహ్నం 12గంటలకు గంగిరెడ్డి అంత్యక్రియలకు సీఎం జగన్ హాజరుకానున్నారు.
ఇవీ చూడండి: తెలంగాణ వాదనలను దీటుగా తిప్పికొడదాం : ఏసీ సీఎం జగన్