ETV Bharat / city

jagan polavaram tour: నేడు పోలవరానికి ఏపీ సీఎం జగన్

author img

By

Published : Jul 19, 2021, 10:07 AM IST

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్(cm jagan)... నేడు పోలవరం(polavaram)లో పర్యటించనున్నారు. ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు అక్కడినుంచి బయలుదేరి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి(tadepalli camp office) చేరుకుంటారు.

cm-jagan-polavaram-tour-at-monday
నేడు పోలవరానికి ఏపీ సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(cm jagan).. నేడు పోలవరం ప్రాజెక్టు (polavaram project)ను సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస చర్యలపై అధికారులతో సమీక్షించనున్నారు. పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరులశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. గడువులోగా ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

నేడు ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్​లో సీఎం పోలవరానికి బయలుదేరతారు. 11 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. 11.10 గంటల నుంచి 12 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్‌ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అధికారులతో ప్రాజెక్టు ప్రగతిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షిస్తారు. నిర్వాసితులకు అందించాల్సిన సహాయక చర్యలు, పరిహారంపై అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు అక్కడినుంచి బయలుదేరి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

ముందుగా ముఖ్యమంత్రి జగన్ ​(cm jagan) ఈ నెల 14న.. పోలవరం ప్రాజెక్టును సందర్శించాలనుకున్నారు. అయితే వాతావరణం అనుకూలించని కారణంగా పర్యటన వాయిదా పడింది. ఫలితంగా సీఎం జగన్.. నేడు పోలవరంలో పర్యటించనున్నారు.

ఇదీ చూడండి: infinity platter : ఫుడ్‌ వ్లోగర్​గా వెంకటేశ్ కుమార్తె... ఆమె ఎందుకలా మారిందో తెలుసా?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(cm jagan).. నేడు పోలవరం ప్రాజెక్టు (polavaram project)ను సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస చర్యలపై అధికారులతో సమీక్షించనున్నారు. పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరులశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. గడువులోగా ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

నేడు ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్​లో సీఎం పోలవరానికి బయలుదేరతారు. 11 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. 11.10 గంటల నుంచి 12 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్‌ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అధికారులతో ప్రాజెక్టు ప్రగతిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షిస్తారు. నిర్వాసితులకు అందించాల్సిన సహాయక చర్యలు, పరిహారంపై అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు అక్కడినుంచి బయలుదేరి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

ముందుగా ముఖ్యమంత్రి జగన్ ​(cm jagan) ఈ నెల 14న.. పోలవరం ప్రాజెక్టును సందర్శించాలనుకున్నారు. అయితే వాతావరణం అనుకూలించని కారణంగా పర్యటన వాయిదా పడింది. ఫలితంగా సీఎం జగన్.. నేడు పోలవరంలో పర్యటించనున్నారు.

ఇదీ చూడండి: infinity platter : ఫుడ్‌ వ్లోగర్​గా వెంకటేశ్ కుమార్తె... ఆమె ఎందుకలా మారిందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.