కారుణ్య నియామకాలు (compassionate appointments) వెంటనే చేపట్టాలని ఏపీ సీఎం జగన్(cm jagan) ఆదేశించారు. కొవిడ్తో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేశారు. నవంబరు 30లోగా కారుణ్య నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
సీఎం జగన్ సమీక్ష:
కొవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది నియామకం.. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్హబ్స్ ఏర్పాటుపై సమీక్షించారు. ఆస్పత్రుల్లో ఖాళీలపై నియామక క్యాలెండర్ రూపొందించామన్న అధికారులు.. ఈనెల 20న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రికి వివరించారు. జాతీయ ప్రమాణాల ప్రకారం ఆస్పత్రుల్లో సిబ్బంది ఉండాలని సీఎం జగన్ తెలిపారు. 176 కొత్త పీహెచ్సీల నిర్మాణంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించగా.. జనవరిలో పనులు ప్రారంభించి 9 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: ప్రేమకు అడ్డొస్తోందని ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కుమార్తె