ETV Bharat / city

'మరోసారి తెలంగాణ జోలికి రాకుండా సమాధానం ఇవ్వాలి'

author img

By

Published : Oct 1, 2020, 5:53 AM IST

నదీజలాలపై ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆరోపణలను తిప్పికొట్టడం సహా... కేంద్రం వైఖరిని ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ సిద్ధమవుతున్నారు. కేంద్రజలశక్తి మంత్రి నేతృత్వంలో జరగనున్న అత్యున్నత మండలి సమావేశానికి పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా నీటిపారుదల శాఖపై సీఎం ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

cm ckr prepare to apex council meeting on irrigation projects
'మరోసారి తెలంగాణ జోలికి రాకుండా సమాధానం ఇవ్వాలి'

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం... పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన అత్యున్నత మండలి-అపెక్స్ కౌన్సిల్ సమావేశం... ఈ నెల 6న జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో దృశ్యమాధ్యమం ద్వారా జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ పాల్గొంటారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోని ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇవ్వడం, గోదావరి జలాల్లో వాటా, కృష్ణాబోర్డు తరలింపు సహా ఇతర అంశాలపై భేటీలో చర్చించనున్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్... ఇవాళ నీటిపారుదలశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో పాటు న్యాయనిపుణులు సమీక్షకు హాజరుకానున్నారు.

యావత్​ దేశానికి తెలిసేలా..

రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెందిన సమగ్ర వివరాలు, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలతో సమావేశానికి రావాల్సిందిగా అధికారులను... ముఖ్యమంత్రి ఆదేశించారు. నదీజలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కావాలనే... కయ్యం పెట్టుకుంతోందని ఆక్షేపించిన సీఎం వారి వాదనలకు అపెక్స్ కౌన్సిల్ భేటీలో ధీటైన సమాధానం చెప్పి మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలు కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేయాలని నిర్దేశించారు. అటు కేంద్రప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని, ఏడు సంవత్సరాల అలసత్వాన్ని కూడా ఎండగట్టాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించి నిజానిజాలను యావత్ దేశానికి తేటతెల్లం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు.

కేంద్రాన్నీ ఎండగడదాం..

కొత్త రాష్ట్రానికి నీటిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఆవిర్భావం వెంటనే ప్రధానమంత్రికి లేఖ రాశామని... ఏడేళ్ల నుంచి సమాధానం రాలేదని కేసీఆర్ తెలిపారు. 1956 అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టంలోని మూడో సెక్షన్ ప్రకారం ప్రత్యేక ట్రైబ్యునల్ లేదా ఇప్పటికే ఉన్న ట్రైబ్యునల్ ద్వారా అయినా కేటాయింపులు చేయాలని కోరినట్టు సీఎం గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అయినా లేక నదీ పరివాహకంలోని అన్ని రాష్ట్రాల మధ్య అయినా నీటి కేటాయింపులు చేయాలని కోరినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేకపోగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్టు అనిపిస్తూ... ఏమీ చేయడం లేదని ముఖ్యమంత్రి ఆరోపించారు. 6న జరగనున్న అత్యున్నత మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా గట్టిగా ఎండగట్టాలని, తెలంగాణాకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు చెప్పారు. తెలంగాణ న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.

ఇదీ చూడండి: మీ శాఖల పరంగా రాష్ట్రాన్ని ముందు వరసలో ఉంచుతున్నారు: సీఎం

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం... పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన అత్యున్నత మండలి-అపెక్స్ కౌన్సిల్ సమావేశం... ఈ నెల 6న జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో దృశ్యమాధ్యమం ద్వారా జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ పాల్గొంటారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోని ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇవ్వడం, గోదావరి జలాల్లో వాటా, కృష్ణాబోర్డు తరలింపు సహా ఇతర అంశాలపై భేటీలో చర్చించనున్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్... ఇవాళ నీటిపారుదలశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో పాటు న్యాయనిపుణులు సమీక్షకు హాజరుకానున్నారు.

యావత్​ దేశానికి తెలిసేలా..

రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెందిన సమగ్ర వివరాలు, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలతో సమావేశానికి రావాల్సిందిగా అధికారులను... ముఖ్యమంత్రి ఆదేశించారు. నదీజలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కావాలనే... కయ్యం పెట్టుకుంతోందని ఆక్షేపించిన సీఎం వారి వాదనలకు అపెక్స్ కౌన్సిల్ భేటీలో ధీటైన సమాధానం చెప్పి మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలు కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేయాలని నిర్దేశించారు. అటు కేంద్రప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని, ఏడు సంవత్సరాల అలసత్వాన్ని కూడా ఎండగట్టాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించి నిజానిజాలను యావత్ దేశానికి తేటతెల్లం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు.

కేంద్రాన్నీ ఎండగడదాం..

కొత్త రాష్ట్రానికి నీటిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఆవిర్భావం వెంటనే ప్రధానమంత్రికి లేఖ రాశామని... ఏడేళ్ల నుంచి సమాధానం రాలేదని కేసీఆర్ తెలిపారు. 1956 అంతర్ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టంలోని మూడో సెక్షన్ ప్రకారం ప్రత్యేక ట్రైబ్యునల్ లేదా ఇప్పటికే ఉన్న ట్రైబ్యునల్ ద్వారా అయినా కేటాయింపులు చేయాలని కోరినట్టు సీఎం గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అయినా లేక నదీ పరివాహకంలోని అన్ని రాష్ట్రాల మధ్య అయినా నీటి కేటాయింపులు చేయాలని కోరినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేకపోగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్టు అనిపిస్తూ... ఏమీ చేయడం లేదని ముఖ్యమంత్రి ఆరోపించారు. 6న జరగనున్న అత్యున్నత మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా గట్టిగా ఎండగట్టాలని, తెలంగాణాకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు చెప్పారు. తెలంగాణ న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.

ఇదీ చూడండి: మీ శాఖల పరంగా రాష్ట్రాన్ని ముందు వరసలో ఉంచుతున్నారు: సీఎం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.