ETV Bharat / city

VRO and Farmer Viral Video: వైరల్‌గా మారిన వీఆర్వో, రైతు ప్రమాణాలు

VRO and Farmer Viral Video: లంచం అడిగాడు.. ఇస్తానని చెప్పా..! అలా చెప్పినా పని పూర్తి చేయలేదు. రెండేళ్ల నుంచి కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నాడు. ఇవి ఓ రైతు చేసిన ఆరోపణలు! లేదు లేదు నేను లంచం అడగలేదు. గుండెపై చేయి వేసి చెప్పు.. నేను లంచం అడిగనని! నేను నిజాయితీగా పని చేసే వ్యక్తిని.. పారదర్శకంగా పని చేస్తున్నాను.. ఇది వీఆర్వో వాదన! మాటకు మాట అనుకున్నారు.. ఒకరి గుండెపై ఒకరు చేయి వేసుకున్నారు? అంతేనా తలపైనా చేతులు పెట్టి ప్రమాణాలు చేసుకున్నారు.. ఇదంతా ఏపీ ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మార్వో కార్యాలయంలో జరిగింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

author img

By

Published : Feb 22, 2022, 5:16 PM IST

VRO
VRO

VRO and Farmer Viral Video: ఏపీ ప్రకాశం జిల్లా అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో బాషాతో ప్రసాద్ అనే రైతు ఘర్షణకు దిగాడు. పాసుబుక్ కోసం రెండేళ్లుగా తిరుగుతున్నానని.. అయినా పట్టించుకోవటం లేదని ఆరోపణలు గుప్పించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల స్థాయి పెరిగింది. పాసుబుక్ కోసం వీఆర్వో ప్రసాద్ లంచం అడిగాడని.. రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ కూడా తలపై చేయి పెట్టి ఒట్టు వేసుకున్నారు. సోమవారం జరిగిన ఈ వ్యవహారం అంతా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వీఆర్వో ఏమన్నారంటే...

రైతుకు సంబంధించిన భూమిలో ప్రస్తుతం ఇటుక బట్టి నిర్వహిస్తున్నారని.. కన్వర్షన్ చేసుకోవాలని వీఆర్వో బాషా తెలిపారు. తాను నిజాయితీగా విధులు నిర్వరిస్తున్నారని.. గతంలో తనపై ఎలాంటి ఆరోపణలు లేవని చెప్పారు. తనపై దౌర్జన్యానికి దిగారని..ఈ ఘటను పోలీసులతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

ఈ ఘటనపై స్థానిక తహసీల్దార్ వివరణ కోరగా.. వ్యవసాయ భూమిని ఇటుక బట్టిగా వాడుతున్నారని..ఈ క్రమంలో తప్పనిసరిగా కన్వర్షన్ చేసుకోవాలని స్పష్టం చేశారు.

వైరల్‌గా మారిన వీఆర్వో, రైతు ప్రమాణాలు

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్... పీఆర్సీ బకాయిలు చెల్లింపు

VRO and Farmer Viral Video: ఏపీ ప్రకాశం జిల్లా అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో బాషాతో ప్రసాద్ అనే రైతు ఘర్షణకు దిగాడు. పాసుబుక్ కోసం రెండేళ్లుగా తిరుగుతున్నానని.. అయినా పట్టించుకోవటం లేదని ఆరోపణలు గుప్పించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల స్థాయి పెరిగింది. పాసుబుక్ కోసం వీఆర్వో ప్రసాద్ లంచం అడిగాడని.. రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ కూడా తలపై చేయి పెట్టి ఒట్టు వేసుకున్నారు. సోమవారం జరిగిన ఈ వ్యవహారం అంతా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వీఆర్వో ఏమన్నారంటే...

రైతుకు సంబంధించిన భూమిలో ప్రస్తుతం ఇటుక బట్టి నిర్వహిస్తున్నారని.. కన్వర్షన్ చేసుకోవాలని వీఆర్వో బాషా తెలిపారు. తాను నిజాయితీగా విధులు నిర్వరిస్తున్నారని.. గతంలో తనపై ఎలాంటి ఆరోపణలు లేవని చెప్పారు. తనపై దౌర్జన్యానికి దిగారని..ఈ ఘటను పోలీసులతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

ఈ ఘటనపై స్థానిక తహసీల్దార్ వివరణ కోరగా.. వ్యవసాయ భూమిని ఇటుక బట్టిగా వాడుతున్నారని..ఈ క్రమంలో తప్పనిసరిగా కన్వర్షన్ చేసుకోవాలని స్పష్టం చేశారు.

వైరల్‌గా మారిన వీఆర్వో, రైతు ప్రమాణాలు

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్... పీఆర్సీ బకాయిలు చెల్లింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.