ETV Bharat / city

ఎమ్మెల్సీ అశోక్‌బాబును సీఐడీ కోర్టులో హాజరుపరిచిన అధికారులు

author img

By

Published : Feb 11, 2022, 10:21 PM IST

తప్పుడు ధ్రువపత్రాల కేసులో అరెస్టయిన తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌ బాబును అధికారులు సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా జడ్జి నివాస ప్రాంతంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

mlc ashok babu
mlc ashok babu

ఏపీ తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబుని సీఐడీ పోలీసులు ఏపీలోని విజయవాడకు తరలించారు. గురువారం రాత్రి అరెస్ట్‌ చేసినప్పటి నుంచి గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారించిన పోలీసులు.. కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. నెగిటివ్‌ అని నిర్ధరణ కావడంతో అశోక్ బాబుని విజయవాడ సీఐడీ కోర్టుకు తీసుకెళ్లారు. భారీ బందోబస్తు నడుమ సీఐడీ జడ్జి ముందు హాజరుపరిచారు.

అశోక్‌ బాబు అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్..

అశోక్‌బాబును అరెస్టు చేయటంపై హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్​పై ఇవాళ విచారణ జరిగింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అశోక్‌బాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అశోక్‌బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

అశోక్ బాబు అరెస్ట్.. ఎందుకంటే..?

తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబును గురువారం రాత్రి సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడలోని నివాసం నుంచి రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన్ను తరలించారు. గురువారం రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరైన అశోక్‌బాబు రాత్రి 11.30 గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మఫ్టీలో మాటు వేసిన సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి, వాహనంలో తరలించారు. అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసే సమయంలో బీకాం డిగ్రీ చదవకపోయినా, చదివినట్లు తప్పుడు ధ్రువపత్రాన్ని సమర్పించారనీ, మరికొన్ని ఆరోపణలతో విజయవాడ వాసి మెహర్‌కుమార్‌.. లోకాయుక్తకు గతంలో ఫిర్యాదు చేశారు.

విచారణ జరిపిన లోకాయుక్త.. వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీకి ఫిర్యాదు చేయాలని ఆ శాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్‌ డి.గీతామాధురి ఇటీవల అశోక్‌బాబుపై సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 477ఏ, 465, 420 తదితర సెక్షన్ల కింద గత నెల 25న కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఆయన్ను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

  • Chandrababu: 'ధైర్యం ఉంటే.. జగన్ ఆ పని చేయగలరా ?'

ఏపీ తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబుని సీఐడీ పోలీసులు ఏపీలోని విజయవాడకు తరలించారు. గురువారం రాత్రి అరెస్ట్‌ చేసినప్పటి నుంచి గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారించిన పోలీసులు.. కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. నెగిటివ్‌ అని నిర్ధరణ కావడంతో అశోక్ బాబుని విజయవాడ సీఐడీ కోర్టుకు తీసుకెళ్లారు. భారీ బందోబస్తు నడుమ సీఐడీ జడ్జి ముందు హాజరుపరిచారు.

అశోక్‌ బాబు అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్..

అశోక్‌బాబును అరెస్టు చేయటంపై హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్​పై ఇవాళ విచారణ జరిగింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అశోక్‌బాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అశోక్‌బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

అశోక్ బాబు అరెస్ట్.. ఎందుకంటే..?

తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబును గురువారం రాత్రి సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడలోని నివాసం నుంచి రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన్ను తరలించారు. గురువారం రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరైన అశోక్‌బాబు రాత్రి 11.30 గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మఫ్టీలో మాటు వేసిన సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి, వాహనంలో తరలించారు. అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసే సమయంలో బీకాం డిగ్రీ చదవకపోయినా, చదివినట్లు తప్పుడు ధ్రువపత్రాన్ని సమర్పించారనీ, మరికొన్ని ఆరోపణలతో విజయవాడ వాసి మెహర్‌కుమార్‌.. లోకాయుక్తకు గతంలో ఫిర్యాదు చేశారు.

విచారణ జరిపిన లోకాయుక్త.. వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీకి ఫిర్యాదు చేయాలని ఆ శాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్‌ డి.గీతామాధురి ఇటీవల అశోక్‌బాబుపై సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 477ఏ, 465, 420 తదితర సెక్షన్ల కింద గత నెల 25న కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఆయన్ను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

  • Chandrababu: 'ధైర్యం ఉంటే.. జగన్ ఆ పని చేయగలరా ?'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.