ETV Bharat / city

చలి చంపేస్తోంది.. రాష్ట్రం వణుకుతోంది.!

author img

By

Published : Dec 29, 2019, 5:03 AM IST

Updated : Dec 29, 2019, 7:15 AM IST

రాష్ట్ర వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం వల్లే చలి తీవ్రత పెరుగుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే నాలుగైదు రోజుల వరకు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్‌ వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. చలి తీవ్రతతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

HYD_CHALI_WINTER
చలి చంపేస్తోంది.. రాష్రం వణుకుతోంది.!
చలి చంపేస్తోంది.. రాష్రం వణుకుతోంది.!

శీతల గాలుల ఉద్ధృతి పెరగడం వల్ల.. రాష్ట్ర ప్రజలు చలితో ఇబ్బందుల పాలవుతున్నారు. ఉత్తర, ఈశాన్య భారత రాష్ట్రాల నుంచి రెండువైపులా శీతల గాలులు తెలంగాణవైపు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. ఆగ్నేయం నుంచి వీస్తున్న తేమ గాలుల ప్రభావంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో తేమగాలుల వల్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని ప్రకటించింది.

ఈసారి చలి తీవ్రత తక్కువే
నల్గొండ, మెదక్‌లో అతితక్కువగా.. 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. రామగుండంలో సాధారణం కన్నా.. ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయని వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం చలి తీవ్రత తక్కువగా ఉందని, జనవరి తొలి వారం నుంచి పెరిగే అవకాశముందని తెలిపింది.

కనిష్ఠ స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఆదిలాబాద్‌ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉందని జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీధర్‌ చౌహాన్‌ తెలిపారు. ఈనెల 31, జనవరి ఒకటో తేదీల్లో 3నుంచి 9 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. జిల్లాలో 2 రోజుల కిందట 17.2 డిగ్రీలుగా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. ఒకరోజు వ్యవధిలోనే 7.6 డిగ్రీలకు పడిపోయాయని పేర్కొన్నారు.

మహానగరంలో విభిన్న వాతావరణం

రెండు రోజుల్లో డిసెంబరు నెల ముగియనుంది. సాధారణంగా ఈ మాసంలో చలికి హైదరాబాద్‌ మహానగరం గజగజ వణికిపోయేది. ఈసారి పెద్దగా చలి లేదు. గతానికి భిన్నంగా రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. గత పదేళ్లలో ఇలాంటి పరిస్థితి ఇప్పుడే కనిపిస్తోంది.

"ఈ కాలంలో ఉత్తర భారతం నుంచి నగరంపైకి శీతల గాలులు వీస్తుంటాయి. ఇప్పటివరకు వాటి ఊసు లేదు. ఇప్పటికీ తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తేమ గాలులే వీస్తుండడంతో ప్రస్తుతం మేఘాలు ఏర్పడుతున్నాయి. ఇది కూడా రాత్రిపూట చలి లేకపోవడానికి ఓ కారణం"

వ్యాధుల ముప్పు.. బీకేర్​ ఫుల్​..!

  • వాతావరణ మార్పులతో సీజనల్‌ వ్యాధుల ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
  • కనిష్ఠ స్థాయిలో నమోదయ్యే ఉష్ణోగ్రతలకు చిన్న పిల్లలు, వృద్ధుల్లో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
  • మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
  • అప్రమత్తంగా ఉంటేనే వ్యాధుల ముప్పు నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: దిల్లీని వణికిస్తోన్న చలిపులి.. అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

చలి చంపేస్తోంది.. రాష్రం వణుకుతోంది.!

శీతల గాలుల ఉద్ధృతి పెరగడం వల్ల.. రాష్ట్ర ప్రజలు చలితో ఇబ్బందుల పాలవుతున్నారు. ఉత్తర, ఈశాన్య భారత రాష్ట్రాల నుంచి రెండువైపులా శీతల గాలులు తెలంగాణవైపు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. ఆగ్నేయం నుంచి వీస్తున్న తేమ గాలుల ప్రభావంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో తేమగాలుల వల్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని ప్రకటించింది.

ఈసారి చలి తీవ్రత తక్కువే
నల్గొండ, మెదక్‌లో అతితక్కువగా.. 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. రామగుండంలో సాధారణం కన్నా.. ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయని వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం చలి తీవ్రత తక్కువగా ఉందని, జనవరి తొలి వారం నుంచి పెరిగే అవకాశముందని తెలిపింది.

కనిష్ఠ స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఆదిలాబాద్‌ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉందని జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీధర్‌ చౌహాన్‌ తెలిపారు. ఈనెల 31, జనవరి ఒకటో తేదీల్లో 3నుంచి 9 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. జిల్లాలో 2 రోజుల కిందట 17.2 డిగ్రీలుగా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. ఒకరోజు వ్యవధిలోనే 7.6 డిగ్రీలకు పడిపోయాయని పేర్కొన్నారు.

మహానగరంలో విభిన్న వాతావరణం

రెండు రోజుల్లో డిసెంబరు నెల ముగియనుంది. సాధారణంగా ఈ మాసంలో చలికి హైదరాబాద్‌ మహానగరం గజగజ వణికిపోయేది. ఈసారి పెద్దగా చలి లేదు. గతానికి భిన్నంగా రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. గత పదేళ్లలో ఇలాంటి పరిస్థితి ఇప్పుడే కనిపిస్తోంది.

"ఈ కాలంలో ఉత్తర భారతం నుంచి నగరంపైకి శీతల గాలులు వీస్తుంటాయి. ఇప్పటివరకు వాటి ఊసు లేదు. ఇప్పటికీ తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తేమ గాలులే వీస్తుండడంతో ప్రస్తుతం మేఘాలు ఏర్పడుతున్నాయి. ఇది కూడా రాత్రిపూట చలి లేకపోవడానికి ఓ కారణం"

వ్యాధుల ముప్పు.. బీకేర్​ ఫుల్​..!

  • వాతావరణ మార్పులతో సీజనల్‌ వ్యాధుల ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
  • కనిష్ఠ స్థాయిలో నమోదయ్యే ఉష్ణోగ్రతలకు చిన్న పిల్లలు, వృద్ధుల్లో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
  • మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
  • అప్రమత్తంగా ఉంటేనే వ్యాధుల ముప్పు నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: దిల్లీని వణికిస్తోన్న చలిపులి.. అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

Intro:Body:Conclusion:
Last Updated : Dec 29, 2019, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.