ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఈ నెల 11 నుంచి 4 రోజుల పాటు పర్యటించనున్నారు. పర్యటన ఏర్పాట్లపై స్థానిక తెదేపా నేతలు ఇప్పటికే సమీక్షించారు.
ఈ నెల 11న బెంగళూరు మీదుగా రోడ్డుమార్గంలో కుప్పం రానున్న చంద్రబాబు.. 11, 12 తేదీల్లో కుప్పం మున్సిపాలిటీ, మండలంలో, 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో, 14న గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో పర్యటించి ప్రజలు, పార్టీ శ్రేణులతో మమేకమవుతారని నేతలు చెప్పారు.
ఇదీ చూడండి: Gold Rate Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?