తెలంగాణలో కుటుంబ పాలన సాగుతున్నందున... భాజపా గెలవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్ సీతాఫల్మండి, బౌద్ధనగర్ డివిజన్లలో భాజపా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోరాడి సాధించుకున్న తెరాస, మజ్లిస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని వ్యాఖ్యానించారు. రెండు పడకగదుల ఇళ్లు, వరద బాధితులను ఆదుకోవడంలో తెరాస విఫలమైందని కిషన్ రెడ్డి విమర్శించారు.
ఇదీ చూడండి: నీరు, కరెంట్ ఫ్రీ, ఆస్తిపన్ను మాఫీ: భాజపా హామీలు