ETV Bharat / city

తెరాస రాష్ట్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం

author img

By

Published : Apr 27, 2020, 2:27 PM IST

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర తెరాస కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని కేటీఆర్​ ప్రారంభించగా పలువురు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాజరై రక్తదానం చేశారు.

blood donation camp held in trs bhavan
తెరాస రాష్ట్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం

తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్​లో రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా పరిస్థితుల్లో రక్తం దొరకక ఇబ్బంది పడుతున్న రోగులను ఆదుకునేందుకు సరైన సమయంగా భావించి నాయకులు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు.

భౌతిక దూరం పాటిస్తూ రక్తదానానికి ఏర్పాట్లు చేశారు. బంజారాహిల్స్​లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన శిబిరంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దానం నాగేందర్​, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఇతర ముఖ్యనాయకులు రక్తందానం చేశారు.

తెరాస రాష్ట్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం

ఇదీ చూడండి: కడసారి చూపు లేకుండానే... గంటల్లో శవం మాయం

తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్​లో రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా పరిస్థితుల్లో రక్తం దొరకక ఇబ్బంది పడుతున్న రోగులను ఆదుకునేందుకు సరైన సమయంగా భావించి నాయకులు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు.

భౌతిక దూరం పాటిస్తూ రక్తదానానికి ఏర్పాట్లు చేశారు. బంజారాహిల్స్​లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన శిబిరంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దానం నాగేందర్​, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఇతర ముఖ్యనాయకులు రక్తందానం చేశారు.

తెరాస రాష్ట్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం

ఇదీ చూడండి: కడసారి చూపు లేకుండానే... గంటల్లో శవం మాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.