ETV Bharat / city

గత పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది: లక్ష్మణ్​

author img

By

Published : Oct 19, 2020, 5:51 PM IST

భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా సీనియర్‌ నేత లక్ష్మణ్‌ బాధ్యతలు చేపట్టారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలైనా బీసీలకు సరైన న్యాయం జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ హయాంలో బీసీలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతారని ఆయన స్పష్టం చేశారు.బీసీలను ఆదుకోవడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు.

గత పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది: లక్ష్మణ్​
గత పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది: లక్ష్మణ్​

గత పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని భాజాపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. విద్య, ఉద్యోగాల్లో కాంగ్రెస్‌ పార్టీ బీసీలను అణగదొక్కిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బీసీ కమిషన్​కి చట్టబద్ధత కల్పించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 90వేల మంది బీసీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ బీసీల కోసం అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం వారికి అవి అందకుండా చేస్తోందని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, దీనికోసం ఓబీసీ మోర్చా కృషి చేయనున్నట్టు స్పష్టం చేశారు.

గత పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది: లక్ష్మణ్​

ఇవీ చూడండి: ప్రస్తుతం 80 కాలనీల్లో నీరు ఉంది: కేటీఆర్

గత పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని భాజాపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. విద్య, ఉద్యోగాల్లో కాంగ్రెస్‌ పార్టీ బీసీలను అణగదొక్కిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బీసీ కమిషన్​కి చట్టబద్ధత కల్పించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 90వేల మంది బీసీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ బీసీల కోసం అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం వారికి అవి అందకుండా చేస్తోందని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, దీనికోసం ఓబీసీ మోర్చా కృషి చేయనున్నట్టు స్పష్టం చేశారు.

గత పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది: లక్ష్మణ్​

ఇవీ చూడండి: ప్రస్తుతం 80 కాలనీల్లో నీరు ఉంది: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.