రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద భాజపా నేతలు ఆందోళనకు దిగారు. ఎస్ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పథకాల ఫ్లెక్సీలు తొలగించలేదని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారనే.. టీచర్లకు విధులు అప్పగించలేదని విమర్శించారు.
ఎస్ఈసీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు భాజపా శ్రేణులు యత్నించారు. అడ్డుకున్న పోలీసులు భాజపా నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా భాజపా శ్రేణులు నినాదాలు చేశారు.
ధర్నాలో భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఇతర భాజపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.