ETV Bharat / city

ప్రభుత్వ విధానాలతో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం: కోమటిరెడ్డి - telangana news

తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో రెండో విడత కౌన్సెలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీల‌కు తీవ్రమైన‌ అన్యాయం జరగనుందని భువ‌నగిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద‌ర్‌కు లేఖ‌ అంద‌జేశారు.

bhuvanagiri mp komatireddy venkatreddy wrote letter to minister eetala rajendar
ప్రభుత్వ విధానాలతో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం: కోమటిరెడ్డి
author img

By

Published : Dec 19, 2020, 5:49 PM IST

కాళోజీ నారాయ‌ణ రావు హెల్త్ యూనివ‌ర్సిటీ అధికారులు‌ సీట్ల భ‌ర్తీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు అన్యాయం చేస్తున్నార‌ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మండిప‌డ్డారు. నిబంధ‌న‌ల ప్రకారం మొదట ఓపెన్ కేటగిరి సీట్లు భర్తీ చేసి తరువాత రిజర్వేషన్ సీట్లను భర్తీ చేయాలి.

కానీ యూనివ‌ర్సిటీ యాజమాన్యం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపించారు. ఈ పద్ధతి దేశంలోనే ఎక్కడా లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవ‌లంభిస్తున్న విధానాలతో బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాళోజీ నారాయ‌ణ రావు హెల్త్ యూనివ‌ర్సిటీ అధికారులు‌ సీట్ల భ‌ర్తీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు అన్యాయం చేస్తున్నార‌ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మండిప‌డ్డారు. నిబంధ‌న‌ల ప్రకారం మొదట ఓపెన్ కేటగిరి సీట్లు భర్తీ చేసి తరువాత రిజర్వేషన్ సీట్లను భర్తీ చేయాలి.

కానీ యూనివ‌ర్సిటీ యాజమాన్యం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపించారు. ఈ పద్ధతి దేశంలోనే ఎక్కడా లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవ‌లంభిస్తున్న విధానాలతో బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 'భూముల విషయం కాకుండా ప్రజా సమస్యలపై స్పందించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.