బీసీలను కించపరిచే విధంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో గొల్ల కురుమలను ఉద్దేశించి మాట్లాడిన తీరు... బీసీల పట్ల ఆయనకున్న వైఖరికి నిదర్శనమన్నారు.
బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా పాలకులు చూస్తున్నారని కృష్ణయ్య విమర్శించారు. రాజకీయంగా ఎదగకుండా అణిచివేతకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో వచ్చే అన్ని ఎన్నికల్లో తెరాసకు ఓటమి తప్పదని హెచ్చరించారు.
ఇదీ చూడండి: కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్