ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. బాలాత్రిపురసుందరీదేవిగా అమ్మవారు

author img

By

Published : Sep 27, 2022, 10:32 AM IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏపీ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు కొలువుదీరారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు బారులుతీరారు.

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. బాలాత్రిపురసుందరీదేవిగా అమ్మవారు
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. బాలాత్రిపురసుందరీదేవిగా అమ్మవారు

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు.. రెండోరోజైన నేడు బాలా త్రిపురసుందరీ దేవిగా కొలువుదీరారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు.

వృద్ధులు, దివ్వాంగులకు నేటి నుంచి దర్శనానికి ప్రత్యేక సమయాన్ని ఆలయ కమిటీ కేటాయించింది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనాన్ని కేటాయించారు. అక్టోబర్ 2న మినహా ఇతర రోజుల్లో వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పించనున్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు.. రెండోరోజైన నేడు బాలా త్రిపురసుందరీ దేవిగా కొలువుదీరారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు.

వృద్ధులు, దివ్వాంగులకు నేటి నుంచి దర్శనానికి ప్రత్యేక సమయాన్ని ఆలయ కమిటీ కేటాయించింది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనాన్ని కేటాయించారు. అక్టోబర్ 2న మినహా ఇతర రోజుల్లో వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పించనున్నారు.

ఇవీ చదవండి:

రెండోరోజూ ఉత్సాహంగా సాగిన బతుకమ్మ వేడుకలు..

ప్రభుత్వ ఆఫీసులో సామానంతా అమ్మేసిన ప్యూన్.. తలుపులు, కిటికీలు కూడా.. మందు కోసమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.