ETV Bharat / city

Attack: అరాచకం.. ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వద్దన్నందుకు దాడి

author img

By

Published : Apr 27, 2022, 12:27 PM IST

Attack: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనం వద్దని, సొంత వాహనంలో వెళ్లిపోతామని చెప్పటమే వారి తప్పైంది. తమ వాహనంలో ఇంటికి వెళతామని చెప్పిన బాలింత భర్తపై.. ఆసుపత్రి భద్రతా సిబ్బంది ఒకరు దాడి చేశారు. ఈ ఘటన ఏపీలోని విశాఖ కేజీహెచ్‌ ప్రసూతి విభాగం వెలుపల జరిగింది. ఇదంతా మామూళ్ల కోసం జరుగుతున్న తంతేనని బాధితుడు ఆరోపించారు.

అరాచకం.. ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వద్దన్నందుకు దాడి
అరాచకం.. ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వద్దన్నందుకు దాడి

Attack: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనం తమకు వద్దని, సొంత వాహనంలో వెళ్లిపోతామని చెప్పినందుకు.. ఆసుపత్రి భద్రతా సిబ్బంది ఒకరు బాలింత భర్తపై దాడి చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ కేజీహెచ్‌ ప్రసూతి విభాగం వెలుపల జరిగింది. అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం పెనుగోలు ధర్మవరం గ్రామానికి చెందిన సారిపిల్లి మనోజ్‌ తన భార్య ఝాన్సీని ప్రసవం కోసం ఈ నెల 19న కేజీహెచ్‌లో చేర్పించారు. ఈ నెల 21న ఆమెకు ఆడబిడ్డ పుట్టింది. బాలింత కోలుకోవడంతో మంగళవారం డిశ్ఛార్జీ చేశారు.

అరాచకం.. ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వద్దన్నందుకు దాడి

ఆ సమయంలో మనోజ్‌ వద్దకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనం డ్రైవరు ఒకరు వచ్చి.. వారి స్వగ్రామానికి వాహనంలో తీసుకువెళతానని చెప్పారు. అయితే తమకు సొంత వాహనం ఉందని, అందులో వెళతామని మనోజ్‌ చెప్పగా.. అంగీకరించిన వాహన డ్రైవరు అవసరమైన పత్రాలు వారికి ఇచ్చి పంపేశారు. ఆ తరవాత భార్య, బిడ్డ, తల్లిదండ్రులతో కలిసి వారి వాహనం వద్దకు వెళుతుండగా.. మరో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవరు వచ్చి మనోజ్‌తో వాగ్వాదానికి దిగారు.

తాము ఉన్నది బాలింతలను తరలించడానికేనని, సొంత వాహనంలో వెళ్లకూడదని అడ్డుపడ్డాడు. దీనికి వారు అంగీకరించకపోవడంతో ఘర్షణ మొదలైంది. ఇంతలో అక్కడే భద్రతా విధులు నిర్వహిస్తున్న కుమార్‌ దూసుకొచ్చి మనోజ్‌ కంటిపై బలంగా కొట్టడంతో ముక్కు వెంట రక్తం వచ్చింది. ఇది జరుగుతున్న సమయంలోనే తన తల్లిదండ్రులతోనూ భద్రతా సిబ్బంది వాగ్వాదానికి దిగారని ఆయన వాపోయారు. ఈ ఘటనపై ఆసుపత్రి వైద్యాధికారులకు ఫిర్యాదు చేసి.. వెళ్లిపోయామని ఆయన తెలిపారు.

విచారణ చేపడతాం..: ప్రసూతి విభాగం వద్ద చోటుచేసుకున్న ఘటనపై విచారణ చేపడతామని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారిణి డాక్టర్‌ పి.మైథిలి తెలిపారు. భద్రతా విభాగ ఉద్యోగి దాడికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు చెప్పారని, దీని ఆధారంగా విచారణ చేయాలని ప్రసూతి విభాగ అధిపతి డాక్టర్‌ నాగమణిని ఆదేశించామన్నారు. భద్రతా ఉద్యోగికి నోటీసులు జారీ చేశామని చెప్పారు.

బిడ్డకో రేటు వసూలు..: తన భార్య ప్రసవం కోసం వస్తే ఆసుపత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పెట్టారని మనోజ్‌ వాపోయారు. మగబిడ్డ పుడితే రూ.5 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.3 వేల చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ముడుపులు ఇస్తే తప్ప వైద్య సేవలు అందడం లేదని వాపోయారు.

ఆసుపత్రిలో దొంగల బెడద కూడా ఉంది. నా సెల్‌ఫోన్, పర్సు చోరీ చేశారు. పర్సులో రూ.4వేల నగదు ఉంది. తెలిసిన వారి వద్ద అప్పు తీసుకొని ఆసుపత్రి నుంచి బయటపడ్డాం. మంగళవారం మేము ఒకరితో వాగ్వాదానికి దిగితే.. మరొకరు వచ్చి దాడి చేసి గాయపర్చారు. ఇదంతా మామూళ్ల కోసం జరుగుతున్న తంతే.-బాధితుడు మనోజ్‌

బాధితుడు మనోజ్
బాధితుడు మనోజ్

ఇదీ చదవండి:

రుయాలో అమానవీయం.. కుమారుడి మృతదేహంతో బైక్‌పైనే స్వగ్రామానికి..

ఇద్దరు యువకుల రహస్య పెళ్లి.. ఇంట్లో వారికి తెలియగానే..

Attack: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనం తమకు వద్దని, సొంత వాహనంలో వెళ్లిపోతామని చెప్పినందుకు.. ఆసుపత్రి భద్రతా సిబ్బంది ఒకరు బాలింత భర్తపై దాడి చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ కేజీహెచ్‌ ప్రసూతి విభాగం వెలుపల జరిగింది. అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం పెనుగోలు ధర్మవరం గ్రామానికి చెందిన సారిపిల్లి మనోజ్‌ తన భార్య ఝాన్సీని ప్రసవం కోసం ఈ నెల 19న కేజీహెచ్‌లో చేర్పించారు. ఈ నెల 21న ఆమెకు ఆడబిడ్డ పుట్టింది. బాలింత కోలుకోవడంతో మంగళవారం డిశ్ఛార్జీ చేశారు.

అరాచకం.. ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వద్దన్నందుకు దాడి

ఆ సమయంలో మనోజ్‌ వద్దకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనం డ్రైవరు ఒకరు వచ్చి.. వారి స్వగ్రామానికి వాహనంలో తీసుకువెళతానని చెప్పారు. అయితే తమకు సొంత వాహనం ఉందని, అందులో వెళతామని మనోజ్‌ చెప్పగా.. అంగీకరించిన వాహన డ్రైవరు అవసరమైన పత్రాలు వారికి ఇచ్చి పంపేశారు. ఆ తరవాత భార్య, బిడ్డ, తల్లిదండ్రులతో కలిసి వారి వాహనం వద్దకు వెళుతుండగా.. మరో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవరు వచ్చి మనోజ్‌తో వాగ్వాదానికి దిగారు.

తాము ఉన్నది బాలింతలను తరలించడానికేనని, సొంత వాహనంలో వెళ్లకూడదని అడ్డుపడ్డాడు. దీనికి వారు అంగీకరించకపోవడంతో ఘర్షణ మొదలైంది. ఇంతలో అక్కడే భద్రతా విధులు నిర్వహిస్తున్న కుమార్‌ దూసుకొచ్చి మనోజ్‌ కంటిపై బలంగా కొట్టడంతో ముక్కు వెంట రక్తం వచ్చింది. ఇది జరుగుతున్న సమయంలోనే తన తల్లిదండ్రులతోనూ భద్రతా సిబ్బంది వాగ్వాదానికి దిగారని ఆయన వాపోయారు. ఈ ఘటనపై ఆసుపత్రి వైద్యాధికారులకు ఫిర్యాదు చేసి.. వెళ్లిపోయామని ఆయన తెలిపారు.

విచారణ చేపడతాం..: ప్రసూతి విభాగం వద్ద చోటుచేసుకున్న ఘటనపై విచారణ చేపడతామని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారిణి డాక్టర్‌ పి.మైథిలి తెలిపారు. భద్రతా విభాగ ఉద్యోగి దాడికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు చెప్పారని, దీని ఆధారంగా విచారణ చేయాలని ప్రసూతి విభాగ అధిపతి డాక్టర్‌ నాగమణిని ఆదేశించామన్నారు. భద్రతా ఉద్యోగికి నోటీసులు జారీ చేశామని చెప్పారు.

బిడ్డకో రేటు వసూలు..: తన భార్య ప్రసవం కోసం వస్తే ఆసుపత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పెట్టారని మనోజ్‌ వాపోయారు. మగబిడ్డ పుడితే రూ.5 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.3 వేల చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ముడుపులు ఇస్తే తప్ప వైద్య సేవలు అందడం లేదని వాపోయారు.

ఆసుపత్రిలో దొంగల బెడద కూడా ఉంది. నా సెల్‌ఫోన్, పర్సు చోరీ చేశారు. పర్సులో రూ.4వేల నగదు ఉంది. తెలిసిన వారి వద్ద అప్పు తీసుకొని ఆసుపత్రి నుంచి బయటపడ్డాం. మంగళవారం మేము ఒకరితో వాగ్వాదానికి దిగితే.. మరొకరు వచ్చి దాడి చేసి గాయపర్చారు. ఇదంతా మామూళ్ల కోసం జరుగుతున్న తంతే.-బాధితుడు మనోజ్‌

బాధితుడు మనోజ్
బాధితుడు మనోజ్

ఇదీ చదవండి:

రుయాలో అమానవీయం.. కుమారుడి మృతదేహంతో బైక్‌పైనే స్వగ్రామానికి..

ఇద్దరు యువకుల రహస్య పెళ్లి.. ఇంట్లో వారికి తెలియగానే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.