తెలంగాణలో సంప్రదాయంగా నిర్వహిస్తున్న సదర్ ఉత్సవాల సందడి హైదరాబాద్లో మొదలైంది. ఈ నెల 29న జరిగే ఉత్సవాలకు యాదవ కమ్యూనిటీలు దున్నరాజులతో సిద్ధమవుతున్నాయి. హరియాణా నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన 1600 కిలోల బరువు ఉండి, రూ.21 కోట్లు విలువ చేసే సర్తాజ్, రుస్తుం దున్నరాజులను... అఖిల భారత యాదవ మహాసభ కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ పరిచయం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి మేలు జాతి దున్నరాజులను ప్రదర్శనలివ్వనున్నారు. ఇప్పటి వరకు షెహెన్షా, యువరాజ్, ధారా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దున్నరాజుల పోషణ, నిర్వహణ, సదర్ ప్రాముఖ్యత వంటి విషయాలపై హరిబాబుతో ఈటీవీ భారత్ ప్రతినిధితో ముఖాముఖి...
సదర్ సమ్మేళనంలో అలరించనున్న సర్తాజ్, రుస్తుం
సదర్ సమ్మేళనం సందడి హైదరాబాద్లో ప్రారంభమైంది. ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సారి వేడుకల్లో హరియాణా నుంచి తీసుకువచ్చిన సర్తాజ్, రుస్తుం దున్నరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే దున్నరాజుల విన్యాసాలు చూసేందుకు నగరవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణలో సంప్రదాయంగా నిర్వహిస్తున్న సదర్ ఉత్సవాల సందడి హైదరాబాద్లో మొదలైంది. ఈ నెల 29న జరిగే ఉత్సవాలకు యాదవ కమ్యూనిటీలు దున్నరాజులతో సిద్ధమవుతున్నాయి. హరియాణా నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన 1600 కిలోల బరువు ఉండి, రూ.21 కోట్లు విలువ చేసే సర్తాజ్, రుస్తుం దున్నరాజులను... అఖిల భారత యాదవ మహాసభ కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ పరిచయం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి మేలు జాతి దున్నరాజులను ప్రదర్శనలివ్వనున్నారు. ఇప్పటి వరకు షెహెన్షా, యువరాజ్, ధారా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దున్నరాజుల పోషణ, నిర్వహణ, సదర్ ప్రాముఖ్యత వంటి విషయాలపై హరిబాబుతో ఈటీవీ భారత్ ప్రతినిధితో ముఖాముఖి...