రాష్ట్రంలో అనధికార ఫ్లాట్లు, అక్రమ లే అవుట్ల క్రమబద్దీకరణకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్కు ఇప్పటి వరకు 8.37 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుం కింద ప్రభుత్వ ఖజానాకు రూ.85.21 కోట్ల ఆదాయం చేకూరింది.
పురపాలక సంఘాల నుంచి 3 లక్షల 36 వేల దరఖాస్తులు, గ్రామపంచాయతీల నుంచి 3 లక్షల 31 వేల దరఖాస్తులు, నగరపాలకసంస్థల నుంచి లక్ష 69 వేల దరఖాస్తులు వచ్చాయి.