ETV Bharat / city

AP High Court: ఆ పత్రం ఇచ్చిన మూడు నెలల్లో పరిష్కరించండి: హైకోర్టు - high court news

AP House scheme case: పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీల్​కు వెళ్లగా.. ధర్మాసనం విచారణ జరిపింది. అర్హులైన వారికి ఇళ్లు కేటాయిస్తే చాలని.. లోతైన విచారణ అవసరం లేదని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు.

ap government go for appeal on houses for poor
పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు విచారణ
author img

By

Published : Nov 30, 2021, 4:56 PM IST

AP house scheme case: పేదలందరికీ ఇళ్ల నిర్మాణంపై సింగిల్ జడ్జీ తీర్పుని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు విచారించింది. ఈ అప్పీల్‌ను ధర్మాసనం పరిష్కరించింది. అర్హులైన పేదలు అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తే తమ పిటిషన్ ఉపసంహరించుకుంటామని... పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు.

Houses scheme in AP: అర్హులైన వారికి ఇళ్ల పట్టాలిస్తామని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది... ధర్మాసనానికి చెప్పారు. ఇరువైపుల వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. ఇళ్ల పట్టాల మంజూరు కోసం మూడు వారాల్లో వినతి పత్రాన్ని సంబంధిత అధికారులకు అందజేసేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు కల్పించింది. వినతిపత్రం ఇచ్చిన మూడు నెలల్లో జిల్లా కలెక్టర్ దానిని పరిష్కరించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

AP house scheme case: పేదలందరికీ ఇళ్ల నిర్మాణంపై సింగిల్ జడ్జీ తీర్పుని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు విచారించింది. ఈ అప్పీల్‌ను ధర్మాసనం పరిష్కరించింది. అర్హులైన పేదలు అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తే తమ పిటిషన్ ఉపసంహరించుకుంటామని... పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు.

Houses scheme in AP: అర్హులైన వారికి ఇళ్ల పట్టాలిస్తామని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది... ధర్మాసనానికి చెప్పారు. ఇరువైపుల వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. ఇళ్ల పట్టాల మంజూరు కోసం మూడు వారాల్లో వినతి పత్రాన్ని సంబంధిత అధికారులకు అందజేసేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు కల్పించింది. వినతిపత్రం ఇచ్చిన మూడు నెలల్లో జిల్లా కలెక్టర్ దానిని పరిష్కరించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఇదీ చదవండి:

Ap Cm Jagan : ఏపీలో 1.84 కోట్ల మందికి ఇళ్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.