ETV Bharat / city

అనుకున్న సమయాని కంటే ముందుగానే.. దిల్లీకి ఏపీ సీఎం

ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్ కన్నా.. 2 గంటల ముందుగానే ముఖ్యమంత్రి దిల్లీకి చేరనున్నారు. ప్రధాని మోదీ సహా కొందరు కేంద్ర మంత్రులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది.

author img

By

Published : Sep 22, 2020, 2:16 PM IST

అనుకున్న సమయానికంటే ముందుగానే.. దిల్లీకి ఏపీ సీఎం
అనుకున్న సమయానికంటే ముందుగానే.. దిల్లీకి ఏపీ సీఎం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన సమయంలో స్వల్ప మార్పు చేసినట్లు.. సీఎంవో తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ కన్నా.. 2 గంటలు ముందుగానే సీఎం దిల్లీకి వెళ్తారని.. వెల్లడించింది. గన్నవరం విమామాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన జగన్​ మరికాసేపట్లో దిల్లీ చేరుకోనున్నారు.

దిల్లీ పర్యటనలో.. ప్రధాని నరేంద్ర మోదీ సహా కొందరు కేంద్రమంత్రులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రితో పాటు.. అడ్వకేట్ జనరల్ సహా ఇతర ఉన్నతాధికారులు దిల్లీ వెళ్లనున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన సమయంలో స్వల్ప మార్పు చేసినట్లు.. సీఎంవో తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ కన్నా.. 2 గంటలు ముందుగానే సీఎం దిల్లీకి వెళ్తారని.. వెల్లడించింది. గన్నవరం విమామాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన జగన్​ మరికాసేపట్లో దిల్లీ చేరుకోనున్నారు.

దిల్లీ పర్యటనలో.. ప్రధాని నరేంద్ర మోదీ సహా కొందరు కేంద్రమంత్రులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రితో పాటు.. అడ్వకేట్ జనరల్ సహా ఇతర ఉన్నతాధికారులు దిల్లీ వెళ్లనున్నారు.

ఇదీ చదవండి:

'సభ్యుల తీరుకు నిరసనగా డిప్యూటీ ఛైర్మన్ ఉపవాసం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.