ETV Bharat / city

రోడ్డుప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలించిన జేసీ - accident at bukkarayasamudram in ananthapuram district

రోడ్డుప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలించిన జేసీ
రోడ్డుప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలించిన జేసీ
author img

By

Published : Mar 31, 2022, 3:32 PM IST

15:22 March 31

రోడ్డుప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలించిన జేసీ

ఏపీలోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రం సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ మంత్రి జేసీ దివాకర్​రెడ్డి పరిస్థితిని గమనించి తన వాహనాన్ని ఆపారు.

క్షతగాత్రురాలిని తన వాహనంలో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మహిళను పరీక్షించిన వైద్యులు.. అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోయారు. యువతి మృతి విషయం తెలుసుకున్న దివాకర్​రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

మృతురాలిది బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లి గ్రామంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: Elephant Attack : చిత్తూరు జిల్లాలో ఏనుగు విధ్వంసం.. రైతు మృతి

15:22 March 31

రోడ్డుప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలించిన జేసీ

ఏపీలోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రం సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ మంత్రి జేసీ దివాకర్​రెడ్డి పరిస్థితిని గమనించి తన వాహనాన్ని ఆపారు.

క్షతగాత్రురాలిని తన వాహనంలో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మహిళను పరీక్షించిన వైద్యులు.. అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలు కోల్పోయారు. యువతి మృతి విషయం తెలుసుకున్న దివాకర్​రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

మృతురాలిది బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లి గ్రామంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: Elephant Attack : చిత్తూరు జిల్లాలో ఏనుగు విధ్వంసం.. రైతు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.