ETV Bharat / city

ఈఎస్​ఐ నిందితులపై అనిశా ప్రశ్నల వర్షం

author img

By

Published : Oct 9, 2019, 2:58 PM IST

ఈఎస్​ఐ ఔషధ కొనుగోళ్ల కుంభకోణంలో ప్రధాన నిందితురాలు, సంస్థ మాజీ సంచాలకురాలు దేవికారాణి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.  కస్టడీలోకి తీసుకున్న ఏడుగురిపై అనిశా అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఈఎస్​ఐ కుంభకోణంలో అనిశా విచారణ

ఈఎస్​ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో అనిశా విచారణ కొనసాగిస్తోంది. సంస్థ మాజీ సంచాలకురాలు సహా ఆరుగురు నిందితులను ఏసీబీ అధికారులు విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. వారి వాంగ్మూలాలు రికార్డ్​ చేస్తున్నారు. అరవింద్​రెడ్డి కార్యాలయంలో నిర్వహించిన సోదాల్లో దొరికిన పత్రాలపై అనిశా ఆరా తీస్తోంది. సాక్ష్యాలు మొత్తం నిందితుల ముందు పెట్టి అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు దేవికారాణి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నిందితులిచ్చే సమాచారంతో ఏసీబీ అధికారులు మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

ఈఎస్​ఐ కుంభకోణంలో అనిశా విచారణ

ఈఎస్​ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో అనిశా విచారణ కొనసాగిస్తోంది. సంస్థ మాజీ సంచాలకురాలు సహా ఆరుగురు నిందితులను ఏసీబీ అధికారులు విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. వారి వాంగ్మూలాలు రికార్డ్​ చేస్తున్నారు. అరవింద్​రెడ్డి కార్యాలయంలో నిర్వహించిన సోదాల్లో దొరికిన పత్రాలపై అనిశా ఆరా తీస్తోంది. సాక్ష్యాలు మొత్తం నిందితుల ముందు పెట్టి అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు దేవికారాణి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నిందితులిచ్చే సమాచారంతో ఏసీబీ అధికారులు మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

ఈఎస్​ఐ కుంభకోణంలో అనిశా విచారణ
sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.