లాక్డౌన్ ఆంక్షల వల్ల ఇబ్బంది పడ్డ మందుబాబులకు ఊపిరి పీల్చుకునే రోజులు వచ్చాయి. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు సడలించిన నేపథ్యంలో సోమవారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో మద్యప్రియులు వైన్ షాపుల ఎదుట బారులు తీరారు. అయితే బెంగళూరులో చిక్అడుగోడి ప్రాంతంలోని ఓ వైన్ షాపులో ఓ వ్యక్తి రూ.52వేల 841 విలువ గల మద్యాన్ని ఒకేసారి కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన బిల్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
మొత్తం 17రకాల బ్రాండ్లను కొనుగోలు చేశాడు ఆ వ్యక్తి. వాస్తవానికి ఒక వ్యక్తికి 2.25 లీటర్ల వైన్, 6 బిరు బాటిళ్లను మాత్రమే విక్రయించాలనే అనుమతి ఉన్నా.. అతడు మాత్రం అంత మొత్తంలో కొనుగోలు చేయడం గమనార్హం.
ఒక్కరోజులో రూ.45కోట్లు..
నిన్న ఒక్కరోజే కర్ణాటకలో దాదాపు రూ.45కోట్ల అమ్మకాలు జరిగాయని రాష్ట్ర ఎక్సజ్ విభాగం తెలిపింది. 3.9 లక్షల లీటర్లు బీరు, 8.5 లక్షల లీటర్ల మద్యాన్ని వినియోగదారులు కొనుగోలు చేశారని పేర్కొంది.
![a-person-buy-rs-52841-wine-in-bengaluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-bng-04-alkohall-bill-7202806_04052020203424_0405f_1588604664_647_0405newsroom_1588606430_420.jpg)
ఇవీ చూడండి: 'నీళ్లు తాగి బతుకుతున్నాం.. మమ్మల్ని పంపేయండి'