ETV Bharat / city

పకడ్బందీగా లాక్​డౌన్.. ఉల్లంఘించిన వారిపై చర్యలు

author img

By

Published : May 20, 2021, 10:02 AM IST

తెలంగాణలో లాక్​డౌన్ ఆంక్షలు తొమ్మిదో రోజు పటిష్ఠంగా అమలవుతున్నాయి. ఉదయం వేళ నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు వచ్చారు. కొన్ని చోట్ల కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులు హెచ్చరించారు.

telangana lockdown, telangana lockdown 2021, lockdown in telangana
తెలంగాణ లాక్​డౌన్, తెలంగాణలో లాక్​డౌన్, తెలంగాణ లాక్​డౌన్ 2021

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు తొమ్మిదో రోజు పకడ్బందీగా అమలవుతున్నాయి. ప్రజలు ఉదయం వేళ నిత్యావసర వస్తువులు కొనేందుకు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉన్నందున మార్కెట్లకు పోటెత్తారు. పలు చోట్ల ప్రజలు కొవిడ్‌ నిబంధనలు మరిచి... భౌతిక దూరం పాటించకుండానే కొనుగోళ్లు సాగించారు.

ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రహదారిపైకి వస్తే జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. 10 దాటిన తర్వాత రోడ్లపైకి వస్తున్న వాహనదారులను అడ్డుకుని వాహనాలు సీజ్ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని సూచించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ మహమ్మారి కట్టడికి కృషి చేయాలని కోరారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు తొమ్మిదో రోజు పకడ్బందీగా అమలవుతున్నాయి. ప్రజలు ఉదయం వేళ నిత్యావసర వస్తువులు కొనేందుకు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉన్నందున మార్కెట్లకు పోటెత్తారు. పలు చోట్ల ప్రజలు కొవిడ్‌ నిబంధనలు మరిచి... భౌతిక దూరం పాటించకుండానే కొనుగోళ్లు సాగించారు.

ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రహదారిపైకి వస్తే జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. 10 దాటిన తర్వాత రోడ్లపైకి వస్తున్న వాహనదారులను అడ్డుకుని వాహనాలు సీజ్ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని సూచించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ మహమ్మారి కట్టడికి కృషి చేయాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.