ETV Bharat / city

తెలంగాణలో.. 5 ఏళ్లలో సారం కోల్పోయిన భూమి 39 లక్షల హెక్టార్లు - తెలంగాణ భూముల్లో సారం క్షీణత

Telangana News Today : తెలంగాణలో మొత్తం 39,652 లక్షల హెక్టార్ల భూమి సారం కోల్పోయింది. 2011-13తో పోలిస్తే 2018-19లో అధిక భూమి క్షీణతకు గురైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 17, ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ తాజాగా విడుదల చేసిన ‘డెసెర్టిఫికేషన్‌ అండ్‌ ల్యాండ్‌ డీగ్రెడేషన్‌ అట్లాస్‌’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

Telangana soil
Telangana soil
author img

By

Published : Feb 23, 2022, 7:11 AM IST

Telangana News Today : దేశవ్యాప్తంగా 2011-13 నుంచి 2018-19 మధ్యకాలంలో కొత్తగా 14.5 లక్షల హెక్టార్ల భూమి సారం కోల్పోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇదే సమయంలో 39,652 హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో 79,283 హెక్టార్ల భూమి నిస్సారంగా మారింది. అత్యధికంగా మహారాష్ట్రలో 4,80,094 హెక్టార్ల భూమి ఎడారీకరణ/క్షీణతకు గురై ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. 2011-13తో పోలిస్తే 2018-19లో అధిక భూమి క్షీణతకు గురైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 6, తెలంగాణ 17వ స్థానంలో నిలిచాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ తాజాగా విడుదల చేసిన ‘డెసెర్టిఫికేషన్‌ అండ్‌ ల్యాండ్‌ డీగ్రెడేషన్‌ అట్లాస్‌’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో ఎడారీకరణ/భూక్షీణతకు నీటికోత, అటవీసంపద తగ్గిపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

.

2018-19 నాటికి..

Telangana Lands : దేశవ్యాప్తంగా 2018-19 నాటికి మొత్తం 9.78 కోట్ల హెక్టార్ల (29.77%) భూమి క్షీణతకు గురైంది. తెలంగాణ రాష్ట్ర మొత్తం భూభాగం 1,14,84,000 హెక్టార్లు కాగా.. అందులో 36,38,508 హెక్టార్లు (31.68%) ఎడారీకరణకు గురైంది. ఆంధ్రప్రదేశ్‌లో 14.84% భూమి క్షీణతకు గురైంది. ఇప్పటివరకు అత్యధిక క్షీణతకు గురైన దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ వరుస స్థానాలను ఆక్రమించాయి.

.

2003-05 నుంచి 2011-13 మధ్య కొంత మెరుగు

Telangana Soil : తెలంగాణ రాష్ట్రంలో 2003-05 వరకు భూక్షీణతకు గురైన ప్రాంతం.. 31.86% కాగా.. 2011-13 నాటికి ఆ మొత్తం 31.34%కి తగ్గింది. అంటే ఆ పదేళ్లలో భూక్షీణతలో 0.52% తగ్గుదల (59,626 హెక్టార్లు) నమోదైంది. 2011-13 నుంచి 2018-19 మధ్యకాలంలో మాత్రం భూక్షీణత 0.34% (39,652 హెక్టార్లు) మేర పెరిగింది. ఇదే కాలంలో నీటికోతకు గురయ్యే వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గింది. అయితే మానవ చర్యలు, లవణీకరణ కారణంగా క్షీణతకు గురైన భూమి ఎక్కువైంది.

రాష్ట్రంలో భూసార క్షీణత ఇలా..

.

వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం భూసార క్షీణత ఇలా..

Telangana Soil News : రాష్ట్రాలవారీ భూభాగాల పరంగా చూస్తే ఇప్పటివరకూ ఝార్ఖండ్‌లో 68.77%, రాజస్థాన్‌లో 62.06%, దిల్లీలో 61.73%, గోవాలో 52.64%, గుజరాత్‌లో 52.22%, నాగాలాండ్‌లో 50%, మహారాష్ట్రలో 46.49%, హిమాచల్‌ప్రదేశ్‌లో 43.11%, త్రిపురలో 42.66%, లద్దాఖ్‌లో 42.31%, కర్ణాటకలో 36.29%, ఒడిశాలో 34.42%, తెలంగాణలో 31.68%, మణిపుర్‌లో 27.44%, మేఘాలయలో 24.86%, జమ్మూకశ్మీర్‌లో 20.86%, పశ్చిమబెంగాల్‌లో 20.10%, ఛత్తీస్‌గడ్‌లో 17.06%, ఆంధ్రప్రదేశ్‌లో 14.84% భూసారం క్షీణతకు గురైంది.

.

Telangana News Today : దేశవ్యాప్తంగా 2011-13 నుంచి 2018-19 మధ్యకాలంలో కొత్తగా 14.5 లక్షల హెక్టార్ల భూమి సారం కోల్పోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇదే సమయంలో 39,652 హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో 79,283 హెక్టార్ల భూమి నిస్సారంగా మారింది. అత్యధికంగా మహారాష్ట్రలో 4,80,094 హెక్టార్ల భూమి ఎడారీకరణ/క్షీణతకు గురై ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. 2011-13తో పోలిస్తే 2018-19లో అధిక భూమి క్షీణతకు గురైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ 6, తెలంగాణ 17వ స్థానంలో నిలిచాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ తాజాగా విడుదల చేసిన ‘డెసెర్టిఫికేషన్‌ అండ్‌ ల్యాండ్‌ డీగ్రెడేషన్‌ అట్లాస్‌’లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో ఎడారీకరణ/భూక్షీణతకు నీటికోత, అటవీసంపద తగ్గిపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

.

2018-19 నాటికి..

Telangana Lands : దేశవ్యాప్తంగా 2018-19 నాటికి మొత్తం 9.78 కోట్ల హెక్టార్ల (29.77%) భూమి క్షీణతకు గురైంది. తెలంగాణ రాష్ట్ర మొత్తం భూభాగం 1,14,84,000 హెక్టార్లు కాగా.. అందులో 36,38,508 హెక్టార్లు (31.68%) ఎడారీకరణకు గురైంది. ఆంధ్రప్రదేశ్‌లో 14.84% భూమి క్షీణతకు గురైంది. ఇప్పటివరకు అత్యధిక క్షీణతకు గురైన దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ వరుస స్థానాలను ఆక్రమించాయి.

.

2003-05 నుంచి 2011-13 మధ్య కొంత మెరుగు

Telangana Soil : తెలంగాణ రాష్ట్రంలో 2003-05 వరకు భూక్షీణతకు గురైన ప్రాంతం.. 31.86% కాగా.. 2011-13 నాటికి ఆ మొత్తం 31.34%కి తగ్గింది. అంటే ఆ పదేళ్లలో భూక్షీణతలో 0.52% తగ్గుదల (59,626 హెక్టార్లు) నమోదైంది. 2011-13 నుంచి 2018-19 మధ్యకాలంలో మాత్రం భూక్షీణత 0.34% (39,652 హెక్టార్లు) మేర పెరిగింది. ఇదే కాలంలో నీటికోతకు గురయ్యే వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గింది. అయితే మానవ చర్యలు, లవణీకరణ కారణంగా క్షీణతకు గురైన భూమి ఎక్కువైంది.

రాష్ట్రంలో భూసార క్షీణత ఇలా..

.

వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం భూసార క్షీణత ఇలా..

Telangana Soil News : రాష్ట్రాలవారీ భూభాగాల పరంగా చూస్తే ఇప్పటివరకూ ఝార్ఖండ్‌లో 68.77%, రాజస్థాన్‌లో 62.06%, దిల్లీలో 61.73%, గోవాలో 52.64%, గుజరాత్‌లో 52.22%, నాగాలాండ్‌లో 50%, మహారాష్ట్రలో 46.49%, హిమాచల్‌ప్రదేశ్‌లో 43.11%, త్రిపురలో 42.66%, లద్దాఖ్‌లో 42.31%, కర్ణాటకలో 36.29%, ఒడిశాలో 34.42%, తెలంగాణలో 31.68%, మణిపుర్‌లో 27.44%, మేఘాలయలో 24.86%, జమ్మూకశ్మీర్‌లో 20.86%, పశ్చిమబెంగాల్‌లో 20.10%, ఛత్తీస్‌గడ్‌లో 17.06%, ఆంధ్రప్రదేశ్‌లో 14.84% భూసారం క్షీణతకు గురైంది.

.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.