రాష్ట్రంలో మరో 169 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనాతో మరో నలుగురు చనిపోయారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 82, రంగారెడ్డిలో 14, మెదక్లో ఇద్దరికి, సంగారెడ్డిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల్లో 5 మంది, విదేశాల నుంచి వచ్చిన 64 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 2,425కి చేరాయి. ఆస్పత్రిలో చికిత్స నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,381 మంది డిశ్ఛార్జి అయ్యారు. మరో 973 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 71కి చేరింది.