ETV Bharat / city

స్వచ్ఛతలో కాచిగూడ రైల్వే స్టేషన్​కు 14వ ర్యాంక్‌

author img

By

Published : Aug 18, 2019, 4:45 AM IST

Updated : Aug 18, 2019, 6:53 AM IST

దక్షిణ మధ్య రైల్వే ఆధునికతపై దృష్టి సారించింది. మానవ వనరుల వినియోగంతో ఖర్చు పెరిగిపోవడం, సమయం వృధా అవుతోందని భావించిన అధికారులు... బోగీలను శుభ్రం చేసేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆటోమేటిక్‌ కోచ్ వాషింగ్ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

స్వచ్ఛతలో కాచిగూడ రైల్వే స్టేషన్​కు 14వ ర్యాంక్‌
స్వచ్ఛతలో కాచిగూడ రైల్వే స్టేషన్​కు 14వ ర్యాంక్‌

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాచిగూడ రైల్వే స్టేషన్​కు ఎంతో ప్రత్యేకత ఉంది. స్వచ్ఛతలో దేశవ్యాప్తంగా 14వ ర్యాంక్‌ సొంతం చేసుకుంది. ఇక్కడ బోగీలు శుభ్రం చేసే కేంద్రంలో ప్రాథమిక నిర్వహణలో భాగంగా 7 ఎక్స్‌ప్రెస్, 3 ప్యాసింజర్ రైళ్లను ద్వితీయ నిర్వహణలో 5 ఎక్స్‌ప్రెస్, 4 ప్యాసింజర్ రైళ్లను శుభ్రం చేస్తున్నారు.

బోగీల శుభ్రతకు కోచ్ వాషింగ్ ప్లాంట్‌

శుభ్రం చేసే కేంద్రంలో 163 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మానవ వనరుల వినియోగం ఖర్చుతో కూడుకున్నది. పైగా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒక్కో రైలును శుభ్రం చేయాలంటే కనీసం ఆరు గంటల సమయం పడుతుంది. ఈ స్థానంలో కోచ్ వాషింగ్ ప్లాంట్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల కేవలం పది నిమిషాల వ్యవధిలో ఒక రైలు పూర్తిగా శుభ్రం చేసే వీలుంది.

రెండున్నర కోట్లతో నిర్మాణం

రైల్వే స్టేషన్​లోని ఐఓహెచ్​ షెడ్డు వద్ద సుమారు రెండున్నర కోట్లతో ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. రైలు బోగీలు ప్లాంట్‌లోకి వెళ్లగానే అక్కడి బ్రష్‌లు విప్పుకుంటాయి. రైలు మెళ్లగా కదులుతుంటే బ్రష్‌లు బోగీలను శుభ్రం చేస్తుంటాయి.

ఇవీ చూడండి: ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడిగా ఉండమని కేసీఆరే అడిగారు'

స్వచ్ఛతలో కాచిగూడ రైల్వే స్టేషన్​కు 14వ ర్యాంక్‌

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాచిగూడ రైల్వే స్టేషన్​కు ఎంతో ప్రత్యేకత ఉంది. స్వచ్ఛతలో దేశవ్యాప్తంగా 14వ ర్యాంక్‌ సొంతం చేసుకుంది. ఇక్కడ బోగీలు శుభ్రం చేసే కేంద్రంలో ప్రాథమిక నిర్వహణలో భాగంగా 7 ఎక్స్‌ప్రెస్, 3 ప్యాసింజర్ రైళ్లను ద్వితీయ నిర్వహణలో 5 ఎక్స్‌ప్రెస్, 4 ప్యాసింజర్ రైళ్లను శుభ్రం చేస్తున్నారు.

బోగీల శుభ్రతకు కోచ్ వాషింగ్ ప్లాంట్‌

శుభ్రం చేసే కేంద్రంలో 163 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మానవ వనరుల వినియోగం ఖర్చుతో కూడుకున్నది. పైగా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒక్కో రైలును శుభ్రం చేయాలంటే కనీసం ఆరు గంటల సమయం పడుతుంది. ఈ స్థానంలో కోచ్ వాషింగ్ ప్లాంట్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల కేవలం పది నిమిషాల వ్యవధిలో ఒక రైలు పూర్తిగా శుభ్రం చేసే వీలుంది.

రెండున్నర కోట్లతో నిర్మాణం

రైల్వే స్టేషన్​లోని ఐఓహెచ్​ షెడ్డు వద్ద సుమారు రెండున్నర కోట్లతో ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. రైలు బోగీలు ప్లాంట్‌లోకి వెళ్లగానే అక్కడి బ్రష్‌లు విప్పుకుంటాయి. రైలు మెళ్లగా కదులుతుంటే బ్రష్‌లు బోగీలను శుభ్రం చేస్తుంటాయి.

ఇవీ చూడండి: ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడిగా ఉండమని కేసీఆరే అడిగారు'

Intro:Body:Conclusion:
Last Updated : Aug 18, 2019, 6:53 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.