ETV Bharat / city

ఏపీలో కొత్తగా 14 మందికి కరోనా... 266కి చేరిన కేసులు

ఆంధ్రాలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. నిన్న సాయంత్రం నుంచి ఇవాళ ఉదయం వరకు కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. ఏఏ జిల్లాలో ఎన్నెన్ని కేసులు నమోదయ్యాయనే వివరాలను ప్రభుత్వం హెల్త్ బులెటిన్​లో ప్రకటించింది.

author img

By

Published : Apr 6, 2020, 11:42 AM IST

ఏపీలో కొత్తగా 14 మందికి కరోనా... 266కి చేరిన కేసులు
ఏపీలో కొత్తగా 14 మందికి కరోనా... 266కి చేరిన కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 266కు చేరింది. విశాఖ జిల్లాలో కొత్తగా మరో ఐదు కేసులు నిర్ధారణ కాగా... గుంటూరు జిల్లాలో కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. ఏపీలో వైరస్​తో మరో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం జిల్లాకు చెందిన 64 వ్యక్తి మృతి చెందగా... మచిలీపట్నానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు కరోనా మొత్తం ముగ్గురు మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్​ విడుదల చేశారు.

జిల్లాల వారీగా పాజిటివ్ కేసులు

  • నెల్లూరు-34
  • కృష్ణా-28
  • గుంటూరు-32
  • కడప-23
  • ప్రకాశం-23
  • ప.గోదావరి-16
  • విశాఖపట్నం-20
  • తూ.గోదావరి-11
  • చిత్తూరు-17
  • అనంతపురం-06
  • కర్నూలు-26

ఇదీ చదవండి :

కరోనా ప్రభావం: మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్​లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 266కు చేరింది. విశాఖ జిల్లాలో కొత్తగా మరో ఐదు కేసులు నిర్ధారణ కాగా... గుంటూరు జిల్లాలో కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. ఏపీలో వైరస్​తో మరో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం జిల్లాకు చెందిన 64 వ్యక్తి మృతి చెందగా... మచిలీపట్నానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు కరోనా మొత్తం ముగ్గురు మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్​ విడుదల చేశారు.

జిల్లాల వారీగా పాజిటివ్ కేసులు

  • నెల్లూరు-34
  • కృష్ణా-28
  • గుంటూరు-32
  • కడప-23
  • ప్రకాశం-23
  • ప.గోదావరి-16
  • విశాఖపట్నం-20
  • తూ.గోదావరి-11
  • చిత్తూరు-17
  • అనంతపురం-06
  • కర్నూలు-26

ఇదీ చదవండి :

కరోనా ప్రభావం: మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.