ETV Bharat / city

తాటి, ఈత వనాలకు ప్రాధాన్యం

కల్లుగీత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. హరితహారంలో తాటి, ఈత మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆబ్కారి, పర్యాటక, క్రీడా శాఖలతో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

author img

By

Published : Mar 6, 2019, 11:58 PM IST

ఆబ్కారి, పర్యాటక, క్రీడా శాఖలతో ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్ సమీక్ష
మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష
రాష్ట్రంలో ఇప్పటికే గుడుంబాను పూర్తిగా నిర్మూలించామని.... ఇంకా ఎక్కడైనా సారా తయారీ కేంద్రాలుంటే అరికట్టారని ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కల్లుగీత కార్మికులను ప్రోత్సహించటానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. బేగంపేటలోని పర్యాటక భవన్​లో ఆబ్కారి, పర్యాటక, క్రీడా శాఖలతో ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆబ్కారి శాఖ పనితీరు గురించి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ... మంత్రి శ్రీనివాస్ గౌడ్​కు వివరించారు. నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, ఇతర రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం రాకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.

నిర్మాణంలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయాలను వెంటనే పూర్తి చేయాలని మంత్రి అన్నారు. హరితహారంలో తాటి, ఈత వనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. పర్యాటక, క్రీడా శాఖలపైనా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష
రాష్ట్రంలో ఇప్పటికే గుడుంబాను పూర్తిగా నిర్మూలించామని.... ఇంకా ఎక్కడైనా సారా తయారీ కేంద్రాలుంటే అరికట్టారని ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కల్లుగీత కార్మికులను ప్రోత్సహించటానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. బేగంపేటలోని పర్యాటక భవన్​లో ఆబ్కారి, పర్యాటక, క్రీడా శాఖలతో ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆబ్కారి శాఖ పనితీరు గురించి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ... మంత్రి శ్రీనివాస్ గౌడ్​కు వివరించారు. నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, ఇతర రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం రాకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.

నిర్మాణంలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయాలను వెంటనే పూర్తి చేయాలని మంత్రి అన్నారు. హరితహారంలో తాటి, ఈత వనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. పర్యాటక, క్రీడా శాఖలపైనా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు.

Intro:సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కె రామస్వామి మృతి చెందారు


Body:సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రామస్వామి జూలై 13 వ తేదీ 1932 లో జన్మించిన ఆయన న్యాయ వ్యవస్థలో అనేక ఉన్నత పదవులను అధిరోహించారు this is రామస్వామికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఆయన కుమారుడు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ శాఖలో విధులు నిర్వర్తిస్తుండగా ప్రథమ కుమార్తె అమెరికాలోని న్యూయార్క్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం గా విధులను నిర్వర్తిస్తూ ఉండగా రెండవ కుమార్తె డాక్టర్ జయ ఉస్మానియా లో పనిచేస్తున్నారు అమెరికాలో ఉన్న జస్టిస్ రామస్వామి ప్రథమ కుమార్తె హైదరాబాద్ కు రావడం ఆలస్యం నేపథ్యంలో ఆయన అంత్యక్రియలు ఈ నెల 8వ తేదీ జూబ్లీ మహా ప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వివరించారు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేబీ రాధాకృష్ణన్ న్యాయమూర్తులు రాఘవేంద్ర సింగ్ చౌహాన్ సంజయ్ కుమార్ రాజశేఖరరెడ్డి అమర్నాథ్ గౌడ్ సి కోదండరాం మాజీ న్యాయమూర్తులు చంద్రయ్య ఈశ్వరయ్య తదితరులు విచ్చేసి రామస్వామి భౌతికకాయం పై
పువ్వులు వేసి నివాళులు అర్పించారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు


Conclusion:జస్టిస్ కే రామస్వామి అంత్యక్రియలు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.