ETV Bharat / city

విధి ఆడుతున్న వింత నాటకంలో వలస జీవులు బలి

కరోనా.. ఈ మహమ్మారి వలస కూలీల పాలిట శాపంలా మారింది. వైరస్​ తెచ్చిన లాక్​డౌన్​ ఉన్న ఉపాధిని పోగొట్టింది. నానా తిప్పలు పడి ఎలాగోలా స్వస్థలాలకు బయలుదేరినా ఇంటికి చేరే మార్గం కనిపించడం లేదు. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు... లాక్​ డౌన్ కష్టాలు ఓవైపు అయితే... ప్రయాణాల్లో ప్రమాదాలు మరోవైపు. చివరకు ఇంటికి చేరాల్సిన వారు ఆసుపత్రులకు చేరుతున్నారు.

author img

By

Published : May 16, 2020, 10:51 AM IST

Updated : May 16, 2020, 1:42 PM IST

road-accident-in-nirmal-19-members-injured
విధి ఆడుతున్న వింత నాటకంలో వలస జీవులు బలి

నిర్మల్‌ జిల్లాలోని కొండాపూర్‌ వద్ద వలస కూలీలు ప్రయాణిస్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌ మేడ్చల్‌ నుంచి వలస కూలీలు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌ పూర్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు.

ప్రమాద సమయంలో లారీలో సుమారు 60 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమించగామెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

నిర్మల్‌ జిల్లాలోని కొండాపూర్‌ వద్ద వలస కూలీలు ప్రయాణిస్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌ మేడ్చల్‌ నుంచి వలస కూలీలు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌ పూర్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు.

ప్రమాద సమయంలో లారీలో సుమారు 60 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమించగామెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.


ఇవీ చూడండి: నలుగురితో నడపలేక.. నష్టాల్లో మునగలేక!

Last Updated : May 16, 2020, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.