ఆదిలాబాద్ జిల్లా మావల హరితవనంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెట్లపై నుంచి ఎగురుతూ వచ్చిన ఓ కొండముచ్చు అక్కడే ఉన్న ట్రాన్స్ ఫార్మర్పై కూర్చోవడం వల్ల విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. దాన్ని కాపాడటానికి వచ్చిన మరో మూడు కొండముచ్చులు షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాయి.
కిందపడిన కొండముచ్చుల్లో రెండింటిని మిగిలిన కొండముచ్చులు అటవీప్రాంతానికి తీసుకెళ్లాయి. ఉదయపు నడకకు వెళ్లిన కొందరు వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ వద్దనే పడి ఉన్న వాటిని కదిలించేందుకు ప్రయత్నించగా.. కొండముచ్చులు దాడికి యత్నించాయి. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.