ETV Bharat / business

జియో సినిమా యూజర్లకు షాక్.. ఫ్రీ కంటెంట్ బంద్! ఛార్జీలు కట్టాల్సిందే!

author img

By

Published : Apr 17, 2023, 9:07 AM IST

జియో సినిమా యాప్​లో ఫ్రీగా ఐపీఎల్​ను ఎంజాయ్ చేస్తున్నారా? అయితే మీరు ఇది చదవాల్సిందే. జియోసినిమా యాప్ త్వరలో డబ్బులు వసూలు చేయనుంది. ఫ్రీ కంటెంట్​కు స్వస్తి పలకనుంది!

JIOCINEMA CHARGES
JIOCINEMA IPL CHARGES

ఐపీఎల్ ప్రసార హక్కులు దక్కించుకున్న తర్వాత జియో సినిమా యాప్​కు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్​లు ప్రసారం చేస్తున్నట్లు సంస్థ చేసిన ప్రకటనతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఏ నెట్​వర్క్ వారైనా.. ఉచితంగానే ఐపీఎల్ మ్యాచ్​లు చూస్తున్నారు. దీంతో వ్యూయర్​షిప్​లో రికార్డులు నమోదయ్యాయి. ఐపీఎల్ స్ట్రీమింగ్ విషయంలో గతంలో నమోదైన రికార్డులన్నీ ఈసారి జియో సినిమా బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఇకపై ఫ్రీ కంటెంట్ విషయంలో జియో సినిమా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్​స్టార్ వంటి ఓటీటీ ప్లాట్​ఫామ్​ల తరహాలో యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. తమ ప్లాట్​ఫామ్​లో 100 కొత్త సినిమాలు, వెబ్​సిరీస్​లు అందుబాటులోకి తెచ్చిన తర్వాత కంటెంట్​కు డబ్బులు వసూలు చేయనున్నట్లు సమాచారం.

ఐపీఎల్ పూర్తైన తర్వాతే జియో సినిమా డబ్బులు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. మే 28న జరిగే ఫైనల్ మ్యాచ్​తో 2023 ఐపీఎల్ సీజన్ ముగుస్తుంది. ఐపీఎల్​కు ముందు కూడా జియో సినిమా యాప్ ఉన్నప్పటికీ.. యూజర్ బేస్ చాలా తక్కువ. ఐపీఎల్ ప్రసారాలతోనే పెద్ద సంఖ్యలో యూజర్లను పోగు చేసుకుంది జియో సినిమా. అయితే, క్రికెట్ అభిమానులే కాకుండా ఇతర ఆడియెన్స్​ను ఆకర్షించేందుకు జియో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మార్కెట్​లో ఉన్న నెట్​ఫ్లిక్స్, అమెజాన్, హాట్​స్టార్ వంటి ఓటీటీలకు పోటీగా జియో సినిమాను తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

జియో సినిమాలో కొత్తగా 100కు పైగా సినిమాలు, టీవీ సిరీస్​లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ కంపెనీ కంటెంట్ బిజినెస్ విభాగ అధిపతి జ్యోతి దేశ్​పాండే ఇటీవల వెల్లడించారు. కొత్త కంటెంట్ చేరిన తర్వాత జియో ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు సైతం భావిస్తున్నాయి. అయితే, దీనిపై జ్యోతి దేశ్​పాండే పూర్తి స్పష్టత ఇవ్వలేదు. ఛార్జీల విధివిధానాలపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఐపీఎల్ ఫైనల్​కు ముందే.. కొత్త కంటెంట్​ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అయినప్పటికీ ఉచితంగానే ఐపీఎల్​ను చూడొచ్చని పేర్కొన్నారు.

ఆదాయం పెరిగే ఛాన్స్..
ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించిన తర్వాత ఓటీటీ మార్కెట్​లో జియో సినిమా నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కంపెనీ ఆదాయం పెరిగేందుకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నాయి. ఉచితంగా ఐపీఎల్​ను ప్రసారం చేస్తున్న జియో.. తన నెట్​వర్క్ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను సైతం ఇదివరకే ప్రవేశపెట్టింది. రోజుకు 3జీబీల ప్లాన్లను ప్రత్యేకంగా ఐపీఎల్ వీక్షకుల కోసం అందుబాటులోకి తెచ్చింది. బేస్ ప్లాన్​ కాకుండా క్రికెట్ ప్రేమికులకు స్పెషల్​గా యాడ్-ఆన్ ప్యాక్​లను సైతం అందుబాటులో ఉంచింది.

ఐపీఎల్ ప్రసార హక్కులు దక్కించుకున్న తర్వాత జియో సినిమా యాప్​కు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్​లు ప్రసారం చేస్తున్నట్లు సంస్థ చేసిన ప్రకటనతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఏ నెట్​వర్క్ వారైనా.. ఉచితంగానే ఐపీఎల్ మ్యాచ్​లు చూస్తున్నారు. దీంతో వ్యూయర్​షిప్​లో రికార్డులు నమోదయ్యాయి. ఐపీఎల్ స్ట్రీమింగ్ విషయంలో గతంలో నమోదైన రికార్డులన్నీ ఈసారి జియో సినిమా బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఇకపై ఫ్రీ కంటెంట్ విషయంలో జియో సినిమా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్​స్టార్ వంటి ఓటీటీ ప్లాట్​ఫామ్​ల తరహాలో యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. తమ ప్లాట్​ఫామ్​లో 100 కొత్త సినిమాలు, వెబ్​సిరీస్​లు అందుబాటులోకి తెచ్చిన తర్వాత కంటెంట్​కు డబ్బులు వసూలు చేయనున్నట్లు సమాచారం.

ఐపీఎల్ పూర్తైన తర్వాతే జియో సినిమా డబ్బులు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. మే 28న జరిగే ఫైనల్ మ్యాచ్​తో 2023 ఐపీఎల్ సీజన్ ముగుస్తుంది. ఐపీఎల్​కు ముందు కూడా జియో సినిమా యాప్ ఉన్నప్పటికీ.. యూజర్ బేస్ చాలా తక్కువ. ఐపీఎల్ ప్రసారాలతోనే పెద్ద సంఖ్యలో యూజర్లను పోగు చేసుకుంది జియో సినిమా. అయితే, క్రికెట్ అభిమానులే కాకుండా ఇతర ఆడియెన్స్​ను ఆకర్షించేందుకు జియో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మార్కెట్​లో ఉన్న నెట్​ఫ్లిక్స్, అమెజాన్, హాట్​స్టార్ వంటి ఓటీటీలకు పోటీగా జియో సినిమాను తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

జియో సినిమాలో కొత్తగా 100కు పైగా సినిమాలు, టీవీ సిరీస్​లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ కంపెనీ కంటెంట్ బిజినెస్ విభాగ అధిపతి జ్యోతి దేశ్​పాండే ఇటీవల వెల్లడించారు. కొత్త కంటెంట్ చేరిన తర్వాత జియో ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు సైతం భావిస్తున్నాయి. అయితే, దీనిపై జ్యోతి దేశ్​పాండే పూర్తి స్పష్టత ఇవ్వలేదు. ఛార్జీల విధివిధానాలపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఐపీఎల్ ఫైనల్​కు ముందే.. కొత్త కంటెంట్​ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అయినప్పటికీ ఉచితంగానే ఐపీఎల్​ను చూడొచ్చని పేర్కొన్నారు.

ఆదాయం పెరిగే ఛాన్స్..
ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించిన తర్వాత ఓటీటీ మార్కెట్​లో జియో సినిమా నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కంపెనీ ఆదాయం పెరిగేందుకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నాయి. ఉచితంగా ఐపీఎల్​ను ప్రసారం చేస్తున్న జియో.. తన నెట్​వర్క్ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను సైతం ఇదివరకే ప్రవేశపెట్టింది. రోజుకు 3జీబీల ప్లాన్లను ప్రత్యేకంగా ఐపీఎల్ వీక్షకుల కోసం అందుబాటులోకి తెచ్చింది. బేస్ ప్లాన్​ కాకుండా క్రికెట్ ప్రేమికులకు స్పెషల్​గా యాడ్-ఆన్ ప్యాక్​లను సైతం అందుబాటులో ఉంచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.